KTR tour in UK: క్యూలో నిల్చున్న కేటీఆర్.. ఆసక్తిగా వీక్షించిన ప్రయాణికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR tour in UK: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యూకే పర్యటనకు వెళ్లారు. బుదవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కేటీఆర్ యూకే బయలుదేరారు. తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ నెల 13 వరకు కేటీఆర్ యూకేలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యూకేలోని పారిశ్రామిక దిగ్గజాలతో పాటు వ్యాపార, వాణిజ్య సంఘాలతో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కంపెనీల ప్రతినిధులు వివరిస్తారు. యూకే వెళ్లేందుకు కేటీఆర్ ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నిరాడంబరతను ప్రదర్శించారు. తనిఖీలు చేసే సమయంలో సామాన్యుడిలా క్యూలో నిల్చున్నాడు. సాధారణ ప్రయాణికులతో పాటు క్యూలో నిలబడి తనిఖీ ప్రక్రియను పూర్తి చేశారు. తనిఖీలు ముగించుకుని కేటీఆర్ ఎయిర్పోర్టు లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్తో సెల్ఫీలు దిగేందుకు ప్రయాణికులు పోటీపడ్డారు.
Read also: Traffic restrictions: అలర్ట్.. మూడు నెలల పాటు అమల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Also Read
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
తమతో పాటు క్యూలో నిల్చున్న కేటీఆర్ను ప్రయాణికులు ఆసక్తిగా వీక్షించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో కేటీఆర్ వెంట పలువురు సిబ్బంది ఉన్నారు. ఈ వీడియోని కేటీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వరస పెట్టని సామాన్యుడు అంటూ పోస్టులు పెడుతున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కేసీఆర్ నమ్రత. క్యూ లైన్లో సాధారణ వ్యక్తిగా నిలిచి ఉదాహరణగా నిలుస్తాడు’. కేటీఆర్ రాష్ట్ర మంత్రి కావడంతో విమానాశ్రయంలో ప్రోటోకాల్ ఉంటుంది. ప్రొటోకాల్ ప్రకారం, భద్రతా సిబ్బంది ప్రత్యేక ప్రవేశద్వారం ద్వారా కేటీఆర్ను లోపలికి అనుమతిస్తారు. అయితే కేటీఆర్ ప్రోటోకాల్ పాటించకుండా సాధారణ ప్రయాణికులతో క్యూలో నిల్చుని లోపలికి వెళ్లారు. గతేడాది మే 18 నుంచి 22 వరకు లండన్లో పర్యటించిన కేటీఆర్.. ఈ సందర్భంగా కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. కేటీఆర్ సూచనతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ముందుకొచ్చాయి.
Top Headlines@9AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..