KTR tour in UK: క్యూలో నిల్చున్న కేటీఆర్.. ఆసక్తిగా వీక్షించిన ప్రయాణికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR tour in UK: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యూకే పర్యటనకు వెళ్లారు. బుదవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కేటీఆర్ యూకే బయలుదేరారు. తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ నెల 13 వరకు కేటీఆర్ యూకేలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యూకేలోని పారిశ్రామిక దిగ్గజాలతో పాటు వ్యాపార, వాణిజ్య సంఘాలతో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కంపెనీల ప్రతినిధులు వివరిస్తారు. యూకే వెళ్లేందుకు కేటీఆర్ ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నిరాడంబరతను ప్రదర్శించారు. తనిఖీలు చేసే సమయంలో సామాన్యుడిలా క్యూలో నిల్చున్నాడు. సాధారణ ప్రయాణికులతో పాటు క్యూలో నిలబడి తనిఖీ ప్రక్రియను పూర్తి చేశారు. తనిఖీలు ముగించుకుని కేటీఆర్ ఎయిర్పోర్టు లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్తో సెల్ఫీలు దిగేందుకు ప్రయాణికులు పోటీపడ్డారు.
Read also: Traffic restrictions: అలర్ట్.. మూడు నెలల పాటు అమల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Also Read
- Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
- Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
తమతో పాటు క్యూలో నిల్చున్న కేటీఆర్ను ప్రయాణికులు ఆసక్తిగా వీక్షించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో కేటీఆర్ వెంట పలువురు సిబ్బంది ఉన్నారు. ఈ వీడియోని కేటీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వరస పెట్టని సామాన్యుడు అంటూ పోస్టులు పెడుతున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కేసీఆర్ నమ్రత. క్యూ లైన్లో సాధారణ వ్యక్తిగా నిలిచి ఉదాహరణగా నిలుస్తాడు’. కేటీఆర్ రాష్ట్ర మంత్రి కావడంతో విమానాశ్రయంలో ప్రోటోకాల్ ఉంటుంది. ప్రొటోకాల్ ప్రకారం, భద్రతా సిబ్బంది ప్రత్యేక ప్రవేశద్వారం ద్వారా కేటీఆర్ను లోపలికి అనుమతిస్తారు. అయితే కేటీఆర్ ప్రోటోకాల్ పాటించకుండా సాధారణ ప్రయాణికులతో క్యూలో నిల్చుని లోపలికి వెళ్లారు. గతేడాది మే 18 నుంచి 22 వరకు లండన్లో పర్యటించిన కేటీఆర్.. ఈ సందర్భంగా కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. కేటీఆర్ సూచనతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ముందుకొచ్చాయి.
Top Headlines@9AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’
-
Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
-
Team India Histroy: టీ20 క్రికెట్లో భారత్ వరల్డ్ రికార్డు.. ఇక ఆస్ట్రేలియా అందుకోలేదుగా!
-
Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
-
Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?