KTR : కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదు.
- బతుకమ్మ చీరలు.. రుణమాఫీ కాలే ఈ సారి దసరా పండుగ దసరా లాగానే లేదు
- ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇది పరిస్థితి
- రెండు పంటలకు కాదు మూడు పంటకు రుణమాఫీ అన్నాడు ఇప్పుడు ఒక్క పంటకే ఇవ్వలేదు : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫార్మా కంపెనీ కడితే కట్టు… లేకపోతే కాంగ్రెస్ పార్టీ రైతులకు తిరిగి భూములను ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూరు ప్రమిద కన్వెన్షన్ హాల్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దసరా సమ్మేళనం కార్యక్రమంలో కేటీఆర్, జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,ఎమ్మెల్యే సబితా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రవేశ పెట్టిన రిజర్వేషన్లు అమలు చేయండని అన్నారు. కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదని, అవినీతి ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరాటం చేద్దామన్నారు. బతుకమ్మ చీరలు,రుణమాఫీ కాలే ఈ సారి దసరా పండుగ దసరా లాగానే లేదని, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇది పరిస్థితి అని కేటీఆర్ మండిపడ్డారు. రెండు పంటలకు కాదు మూడు పంటకు రుణమాఫీ అన్నాడు…ఇప్పుడు ఒక్క పంటకే ఇవ్వలేదని, నాట్లకు కాదుగా కోతలకు కూడా రైతులకు 10 వేలు కూడా వేయకుండా పోయిందన్నారు. రైతుల తరపున పోరాటం చేస్తుంది మేము అని, మిగతా పార్టీలు ఇబ్రహీంపట్నం లో కమ్యూనిస్ట్ పార్టీ, రైతు సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాహుల్ గాంధీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఏమైందిని ప్రశ్నించారన్నారు.
Bandi Sanjay : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
అంతేకాకుండా..’రిజర్వేషన్ కోటలో అవకతవకలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పెద్ద పెద్ద నాయకులతోనే కొట్లాడినం,ఈ చిన్న నాయకులతో కొట్లాడడం మాకు కొత్త కాదు. పండుగలకు ఎలాంటి తోఫాలు ఇవ్వలేదు. ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి పింఛన్ ఇస్తా అని హామీ ఇచ్చి నెరవేర్చే లేదు. అడిగితే ఉచిత బస్సు లని అనడం ఎండని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క మంచిపని చెప్పలని అన్నారు. నేను గుంపు మెస్ట్రీ అని చూపిన రేవంత్…. కూల్చే మేస్త్రీ అయింది. కాంగ్రెస్ పార్టీని అన్ని విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి… ఈ రాష్ట్రం కేసీఆర్ ను కోరుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో, బడులలో కనీస సౌకర్యాలు తీర్చడానికి డబ్బులు లేవు. మూసీ ప్రక్షాళనకు కోట్లు ఖర్చు చేయడం ఏంటని అడిగారు. మా ఇండ్లు కూర్చు….ఒప్పుకుంటాం.. పేదల ఇండ్లు కూర్చకు. 2015లో ఫార్మా సిటీ ఏర్పాటు కు శ్రీకారం చుట్టడం జరుగింది…14వేల ఎకరాలు సేకరించడం జరిగింది. ఫార్మా సిటీ లో భూములు కోల్పోయిన రైతులకు భూములు తిరిగి ఇయ్యాలి. భూ సేకరణ చట్టం ప్రకారం భూముని తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. రాష్ట్రంలో సకల జనుల ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. ‘ అని కేటీఆర్ అన్నారు.
Trap : సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన హైదరాబాదీ.. సాయం కోసం ఎదురుచూపులు
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!