Trap : సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన హైదరాబాదీ.. సాయం కోసం ఎదురుచూపులు
- సుమారు ఓ 50 ఏళ్లకు దగ్గరలో వయసున్న వ్యక్తి
- ఉచితంగా ఉమ్రా పేరుతో సౌదీ అరేబియాకు తరలింపు
- తిరిగి ఇండియా తీసుకురావాలని బాధితుడు వేడుకోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుమారు ఓ 50 ఏళ్లకు దగ్గరలో వయసున్న వ్యక్తి.. పైగా వికలాంగుడు.. రెండేళ్లుగా సౌదీ అరేబియాలోని రియాద్లో చిక్కుకుపోయాడు. దిక్కూ మొక్కు లేక దేశం కాని దేశంలో ఇరుక్కుపోయి ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. దయనీయమైన అతని కన్నీటి గాథకి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నగరానికి చెందిన సయ్యద్ హాజీ స్వతహాగా వికలాంగుడు. ఉమ్రా , హజ్ తీర్థయాత్ర చేయడానికి తీసుకెళ్తామంటే గుడ్డిగా నమ్మేశాడు. కానీ అతనికి అలా చెప్పి తీసుకెళ్లిన ఏజెంట్ల ద్వారా మోసపోయాడు. ఉమ్రా అంటే ఓ ఏడాది కాలంలో ముస్లింలు ఎప్పుడైనా మక్కా తీర్థయాత్ర చేస్తే దానిని ఉమ్రా అంటారు. అయితే.. అతనిని ఉచితంగా ఉమ్రా తీర్థయాత్ర చేయడానికి తీసుకెళ్తానని, తిరిగి మళ్లీ తీసుకువస్తామని ఏజెంట్లు వాగ్దానం చేసినట్లు వికలాంగుడైన సయ్యద్ హాజీ ఆరోపిస్తున్నాడు. ఉమ్రా పూర్తయిన తర్వాత వారు అతడిని సౌదీ అరేబియాలోని రియాద్కు తీసుకెళ్లి పని చేయమన్నారని చెబుతున్నాడు. ఈ క్రమంలో ఒక హోటల్లో పని కోసం ఉన్నప్పటికీ తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా చేయలేనని నిర్ణయించుకుని తిరిగి ఇండియా రావాలని భావించాడు.
Krishna District: చెరువులో ఈతకు వెళ్లిన విద్యార్థుల్లో ఐదుగురు క్షేమం.. ఇద్దరు మృతి
Also Read
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
- Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
కానీ, ఉమ్రాకు తీసుకెళ్తామని మాట ఇచ్చిన ఆ ఏజెంట్లు అతన్ని సౌదీ అరేబియాలోని రియాద్లోనే విడిచిపెట్టారు. గత రెండేళ్లుగా చేసేది లేక సయ్యద్ హాజీ ఫుట్పాత్లపైనే జీవనం సాగిస్తున్నాడు. ఆ దారిలో వచ్చిపోయే వారు ఇచ్చే ఆహారంతోనే కడుపు నింపుకుంటున్నాడు. తన పరిస్థితి ఇక్కడ అయోమయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో సౌదీ అరేబియా రియాద్లోని భారత రాయబార కార్యాలయానికి ఎలాగైనా తమ గోడు తెలుపుకోవాలని, సయ్యద్ హాజీని తిరిగి తెచ్చుకోవాలని అతని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించి భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు లేఖ రాశారు. సయ్యద్ హాజీ నంబర్ 0505260733 లేదా ఇండియా వాట్సప్ నంబర్ 8341544010కి కాల్ చేసి వీలైనంత త్వరగా తిరిగి హైదరాబాద్కు తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుతున్నారు.
Krishna District: చెరువులో ఈతకు వెళ్లిన విద్యార్థుల్లో ఐదుగురు క్షేమం.. ఇద్దరు మృతి
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
-
Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
-
India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
-
Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. జీతంలో 1.5% కట్.!
-
Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!