అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై హిందూ సమాజం అంతా ఆలోచన చేయాలన్నారు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎస్సీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిత్యం అద్దంకి దయాకర్ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని, అద్దంకి దయాకర్ మద్యం సేవించి, డ్రగ్స్ తీసుకుని మాట్లాడినట్లు ఉందన్నారు కొప్పు భాష. సీతా, రాముల చరిత్ర, దేశ చరిత్ర అద్దంకి దయాకర్ కు లేదని, అద్దంకి దయాకర్ హిందువా.. క్రిస్టియన్ హా స్పష్టం చేయాలన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హిందువులను తిట్టమని చెప్పారా?. మతపరమైన రిజర్వేషన్లు వద్దని అంబేద్కర్ చెప్పారు అని ఆయన అన్నారు. అంబేద్కర్ ఆశయానికీ తూట్లు పొడిచి మతపరమైన రిజర్వేషన్లు తెచ్చారని, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాలని అద్దంకి దయాకర్ తో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాట్లాడించారని కొప్పు బాష అన్నారు.
అంతేకాకుండా..’నరేంద్ర మోడీ, అమిత్ షాను వినర్శిస్తావా.. ఒక్కసారి మోదీ, అమిత్ షా చరిత్ర తెలుసుకో.. నీ మాదిరిగా పూటకో పెళ్లి చేసుకునే చరిత్ర కాదు.. ఇటలీ యూనివర్శిటి నుంచి వచ్చిన వాళ్లకు భారత దేశ చరిత్ర ఏమీ తెలుసు.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న హిందూ వ్యతిరేక విధానాలపై హిందూ సమాజం ఆలోచన చేయాలి.. అద్దంకి దయాకర్ అమ్మను, భార్యను అసలు నీవు ప్రేమిస్తావా.. అద్దంకి దయాకర్ దళితుడు కాదు.. క్రిస్టియన్.. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాలి.. అద్దంకి దయాకర్ ను కోమటిరెడ్డి సోదరులే బరించలేదు.. హిందూ సమాజం ఏమీ భరిస్తుంది’ అని కొప్పు భాష అన్నారు.