సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసు కాల్పుల్లో మరణించిన రాకేష్ అంతిమ యాత్రలో పాల్గొనేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరంగల్ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే విషయం తెలిసిన కాంగ్రెస్ నేతలు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఎర్రబెల్లి దయాకర్ రావు పిచ్చి చేష్టలే నన్ను మంత్రిని చేసిందని, ఇప్పడు కేసీఆర్ చేష్టలతో కాంగ్రెస్ నీ అధికారంలోకి తెస్తారంటూ ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ఉద్యమం చేయాలి కానీ.. వచ్చిన తెలంగాణలో ఉద్యోగాల కోసం ఉద్యమం చేయాలా..? అని ఆమె ప్రశ్నించారు.
మేము ఇచ్చిన తెలంగాణను సెట్ చేస్ బాధ్యత మాదే అని ఆమె అన్నారు. మమల్ని అడ్డుకునే ప్రయత్నం ఎంత చేస్తే.. అంతా ఎక్కువ ఆందోళనలు చేయాల్సి వస్తుందని, కొండా సినిమాని ఎర్రబెల్లి అడ్డుకోవాలని చూస్తున్నాడని ఆమె ఆరోపించారు. రేవంత్ రాకుండా అడ్డుకుంటున్నారని, రేవంత్ వస్తే ఎర్రబెల్లి బండారం బయట పెడతారు అని భయం అంటూ ఆమె సెటైర్లు వేశారు. ఎర్రబెల్లిని తిట్టాలంటే వరంగల్కే రావాలా..? హైదరాబాద్ లో ఉండి తిట్టడకూడదా ..? అంటూ ఆమె విమర్శలు గుప్పించారు.