Komatireddy: హరీష్ రావ్ బీజేపీలో చేరడం ఖాయం.. కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy: ఎంపీ ఎన్నికల తర్వాత హరీష్ రావు బీజేపీలో చేరతారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్.. హరీష్.. కేటీఆర్.. మాత్రమే బీఆర్ఎస్ లో మిగిలుతారన్నారు. పార్టీ నిర్ణయమే నా నిర్ణయమన్నారు. పార్టీ ఫైనల్.. ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి పని చేస్తా అన్నారు. నల్గొండ, భువనగిరి లో భారీ మెజార్టీ తో గెలుస్తుంది కాంగ్రెస్ అని తెలిపారు. చేరికలపై గేట్లు మేమేం ఎత్తలేదు.. దూసుకుని వస్తున్నారని తెలిపారు. కేసీఆర్ చేసిన పాపం ఆయనకే తగిలిందన్నారు. ఆయన నేర్పిన విద్యనే కదా అన్నారు. కేసీఆర్ చేసిన పాపాల మూలంగా కరువు వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అంటే వర్షం.. వర్షం అంటే కాంగ్రెస్ అనేట్టు ఉండేదన్నారు.
Read also: K. Keshava Rao: సీఎం రేవంత్ రెడ్డి తో ముగిసిన కేకే భేటీ..
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
రైతుల బాధ చూస్తే ఏడుపు వస్తుంది.. దీనికి కేసీఆర్ చేసిన పాపమే కారణమన్నారు. యాదాద్రి గుట్టపైనా కేసీఆర్ బొమ్మ.. కారు బొమ్మ వేసుకున్న పాపం తగిలిందన్నారు. కేసీఆర్ ట్యాపింగ్ పాపంతో చాలా మంది పోలీసు అధికారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అన్నారు. సీఎంఆర్ఎఫ్ కాళేశ్వరం లో దోపిడీ జరిగిందని మండిపడ్డారు. దేవుడు పేరు తో కట్టిన ప్రాజెక్టులో అవినీతి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ చిల్లర వ్యవహారం అని మండిపడ్డారు. ప్రతీది రాజకీయం చేయడమే కేసీఆర్ పని అన్నారు. కాంగ్రెస్ అంటే కరువు అని హరీష్ బుద్ది లేని మాటలు మాట్లాడుతున్నాడన్నారు. యాదగిరిగుట్ట పోతే దేవుడే కనపడకుండా చేశారు కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడిది? అని ప్రశ్నించారు.
Read also: Rajasthan : చెత్త సేకరణకు గాడిదలు.. టెండర్లు పిలిచిన మున్సిపల్ కార్పొరేషన్
నీ టికెట్ వద్దు అని కావ్య అంటుంది అంటే అర్థం చేసుకోవాలన్నారు. కేసీఆర్.. హరీష్.. కేటీఆర్.. మాత్రమే మిగిలుతారు బీఆర్ఎస్ లో అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎన్నికల తర్వాత… హరీష్ బీజేపీ లో చేరతారని అన్నారు. పాత నాయకులకు అన్యాయం జరగదు.. జరిగితే మేము మాట్లాడమా అని భరోసా ఇచ్చారు. మోడీ 400 సీట్లు వస్తాయి అన్నాడు.. అభ్యర్థులను మాత్రం పక్క పార్టీ నుండి తీసుకుంటున్నారని తెలిపారు. కే.కేశవరావు అపార అనుభవం ఉన్న నాయకుడని, కాంగ్రెస్ వచ్చి మూడు నెలలే అయ్యింది.. మా మీద దాడి చేయడం కేకే లాంటి వాళ్లకు నచ్చలేదన్నారు.
Read also: TS Water Problems: ముదిరిన ఎండలు.. నీటి కోసం ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్
అందుకే బయటకు వస్తున్నారని తెలిపారు. మూడు నెలలు అధికారంకి దూరం కాగానే.. జీర్ణించుకోలేక పోతున్నారు కేసీఆర్ కుటుంబ సభ్యులు అన్నారు. మే.. జూన్ లో ఆర్ఆర్ఆర్ టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. టానిక్ వైన్ షాప్ మీదనే 6 వేల కోట్లు సంపాదించారన్నారు. కేసీఆర్ అవినీతి పై విచారణ చేయాలి అంటే 20 ఏండ్లు పడుతుందన్నారు. తలసాని చుట్టూ ఉన్నవాళ్లు లో వెయ్యి కోట్లకు తక్కువ ఎవ్వడు లేడన్నారు.
Rajasthan : చెత్త సేకరణకు గాడిదలు.. టెండర్లు పిలిచిన మున్సిపల్ కార్పొరేషన్
తాజావార్తలు
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!