komatireddy Rajgopal Reddy: కోమటి రెడ్డి వ్యవహారంపై ఢిల్లీలో కాంగ్రెస్ కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
congress hold key meeting with telangana leaders about komatireddy Rajgopal Reddy issue: కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్ది రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో, నల్లగొండ జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి.. బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించింది. కోమటి రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతోంది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ జనరల్ సెక్రటరీ కే. వేణుగోపాల్ నివాసంలో సమావేశం ప్రారంభం అయింది. రాజగోపాల్ రెడ్ది వ్యవహారంపై జరుగుతున్న ఈ భేటీలో తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం, నల్లగొండ ముఖ్య నేతలతో చర్చించిన తరువాత కాంగ్రెస్ అధిష్టానం అంతిమ నిర్ణయం తీసుకోనుంది.
Read Also: Uttar Pradesh Crime: 2009లో భర్తకు జైలు శిక్ష.. 2022లో ప్రాణాలతో తిరిగొచ్చిన భార్య
Also Read
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
రాజగోపాల్ రెడ్ది పార్టీ వీడకుండా..చూడాలని గతవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కే. వేణుగోపాల్ నివాసంలో చర్చించారు. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డికి నచ్చచెప్పేందుకు పార్టీ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్ ప్రయత్నించినా.. ఆయన మెత్తబడలేదు. దీని తరువాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు నచ్చచెప్పాలని చూసినా.. పార్టీని వీడేందుకే రాజగోపాల్ రెడ్డి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బుజ్జగింపు చర్యలు ద్వారా ఫలితం రాకపోవడంతో.. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడితే ఎలాంటి నష్టాలు ఉంటాయనే దానిపై.. నివారణ చర్యలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో అధిష్టానం చర్చిస్తోంది.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..