Uttar Pradesh Crime: 2009లో భర్తకు జైలు శిక్ష.. 2022లో ప్రాణాలతో తిరిగొచ్చిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Sentenced To 10 Years For Killing Wife Who Turns Up Alive: భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం సహజమే! ఎంత అన్యోన్యత ఉన్నప్పటికీ, ఏదో ఒక సమయంలో సహనం కోల్పోయి గొడవలకు దిగుతుంటారు. ఆ తర్వాత మళ్లీ సర్దుకుంటారు. ఒకవేళ సఖ్యత కుదరకపోతే, విడాకులు తీసేసుకుంటారు. కానీ, ఇక్కడ ఓ భార్య మాత్రం తన భర్తకు చాలా పెద్ద శిక్ష వేసింది. చెయ్యి చేసుకున్న పాపానికి అతనికి బుద్ధి చెప్పాలనుకొని, తాను చనిపోయినట్లు కథ అల్లింది. పాపం, చేయని నేరానికి అతనికి పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
2006లో జాంపూర్ గ్రామానికి చెందిన కంధాయ్ అనే వ్యక్తికి, అదే గ్రామానికి చెందిన రమావతి అనే యువతితో వివాహం అయ్యింది. వీళ్ల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కానీ, 2009లో ఒక రోజు రమాదేవి హఠాత్తుగా మాయమైంది. ఆమెను ఎంత వెతికినా దొరకలేదు. దీంతో.. కాంధాయ్ను రమావతి బంధువులు కోర్టుకు ఈడ్చారు. తమ బిడ్డను అతడు హత్య చేశాడంటూ కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. ఎనిమిదేళ్లు గడిచిపోయినా.. రమావతి జాడ కనిపించకపోయేసరికి, కంధాయ్ ఆమెని చంపి ఉంటాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. 2017లో స్థానిక కోర్టులో అతడ్ని హాజరు పరచగా.. భార్యని చంపిన కేసులో అధిష్టానం అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆరు నెలల శిక్ష తర్వాత అనుభవించిన తర్వాత.. అలహాబాద్ హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు.
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
కట్ చేస్తే.. రమావతి, కంధాయ్ ఇరు కుటుంబాలకు దగ్గరి బంధువైన ఓ వ్యక్తి, ఈమధ్యే రమావతి సోదరి ఇంటికి వెళ్లాడు. అక్కడ అతనికి రమావతి కనిపించింది. దీంతో ఖంగుతిన్న అతగాడు, వెంటనే సమాచారాన్ని కంధాయ్కు చేరవేశాడు. భార్య బతికే ఉందన్న విషయం తెలిసి, కంధాయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాడు. తన బంధువులతో కలిసి రమావతి సోదరి ఇంటికి చేరుకున్నాడు. ఎప్పుడో చనిపోయిందనుకున్న రమావతి, తమ కళ్ల ముందే ప్రాణాలతో ఉండటం చూసి అందరూ షాకయ్యారు. అక్కడి నుంచి ఆమెను వన్ స్టెప్ సెంటర్(మహిళా సంక్షేమ కేంద్రం)కు తీసుకెళ్లి, చనిపోయినట్టు ఎందుకు నటించావని ఆరా తీశారు. అప్పుడు ఆమె చెప్పిన సమాధానం విని, అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసలేం చెప్పిందో తెలుసా?
2009లో చాయ్ విషయంలో భర్త తనతో గొడవ పడ్డాడని, అప్పుడు అతడు తన మీద చెయ్యి చేసుకున్నాడని రమావతి తెలిపింది. అది నచ్చకనే, భర్తను జైలు పాలు చెయ్యాలన్న ఉద్దేశంతో ఈ నాటకానికి తెరలేపానని తెలిపింది. ఈ సమాధానంతో పాటు ఇన్నేళ్లపాటు తన జాడ కనిపించకుండా గోప్యంగా ఉండడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఫేక్ డెత్ నాటకం వెనుక రమావతి కుటుంబ ప్రమేయం కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
-
Virat Kohli: నాకు చాలా భయమేస్తోంది.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..