Komatireddy Rajagopal Reddy: అమ్ముడుపోయే వ్యక్తి ప్రభుత్వంపై పోరాటం చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Rajagopal Reddy: తనపై ఆరోపణలు చేస్తూ పోస్టర్లు వేశారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 రోజుల నుంచి తానంటే గిట్టని వ్యక్తులు ప్రచారం చేస్తున్నారని అన్నారు. డబ్బుల కోసం పార్టీ మారాలని అనుకుంటే 12 మందితోనే వెళ్లేవాడినని ఆయన అన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం పార్టీలో అవమానాలు జరుగుతున్నా అభివృద్ధి కోసం కాంగ్రెస్లో ఉన్నానని.. కానీ అది జరగలేదు అందుకే పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. అమ్ముడుపోయే వ్యక్తి ప్రభుత్వంపై పోరాటం చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. కుటుంబ పాలన పోవాలి, అవినీతి ప్రభుత్వం పోవాలని పోరాటం చేశానని చెప్పారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీన పడిందని.. అందుకే బీజేపీ వైపు నిర్ణయం తీసుకున్నానన్నారు. అమిత్ షాను కలవగానే గట్టుప్పల్ మండల ఏర్పాటు నిర్ణయం వచ్చిందన్నారు. తన రాజీనామా తన కోసం కాదన్న ఆయన.. అభివృద్ధి కోసమేనన్నారు. సోనియా గాంధీ అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే కొందరు నేతల కుట్రలో భాగంగా పోస్టర్లు వెలిశాయన్నారు. టీఆర్ఎస్ ఎన్నిసార్లు ఆహ్వానించినా తాను వెళ్లలేదన్నారు. స్వార్థంతో రాజీనామా చేస్తే ప్రజలు స్వాగతిస్తారా అంటూ ప్రశ్నించారు. తనపై ఆరోపణలను రుజువు చేయమని తాను సవాల్ విసిరినట్లు తెలిపిన రాజగోపాల్ రెడ్డి.. కానీ తన సవాల్ను స్వీకరించలేదన్నారు. తాను తప్పు చేయలేదని.. 10వేల మందితో గర్భ గుడిలో ప్రమాణం చేస్తానని ఆయన అన్నారు. మునుగోడు నియోజకవర్గం ప్రజలపై తనకు నమ్మకం ఉందని.. తనను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతకుంటారని ఆయన తెలిపారు. మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చి చరిత్రలో నిలిచిపోతారన్నారు.
Also Read
- Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Komatireddy Venkat Reddy : నేను ప్రచారానికి రాకపోయినా గెలిపించాలి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
- Bhatti Vikramarka: తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం.. మా టార్గెట్ ఇదే
- Secunderabad: పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు.. ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు ప్రారంభం
Tammineni Veerabhadram: మునుగోడులో బీజేపీని ఓడించేందుకు ఏ పార్టీకైనా మద్దతిస్తాం..
తనపై ఆరోపణలు చేసే వాళ్లు ఆధారాలతో వస్తే తాను నివృత్తి చేస్తామన్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం అమిత్ షా ఆధ్వర్యంలో ధర్మయుద్ధం శంఖారావాన్ని పూరించడానికి వస్తున్నారన్నారు. భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ తనకు తెలియదన్నారు.
తాజావార్తలు
-
New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
-
Sooraj Pancholi: కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా.. జియా ఖాన్ కేసులో సూరజ్ బాధకు ముగింపు లేదా?
-
YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
-
Raj Thackeray: మోదీని పొగిడి విదేశాల్లో ఎందుకు ఉంటున్నారు? మాధవన్, వివేక్ ఒబెరాయ్పై రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
-
Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?