Kishan Reddy: హైదరాబాద్ లో వికసిత్ భారత్ కార్యక్రమం.. నేడు కిషన్ రెడ్డి షెడ్యూల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: గత ఏడాది శంషాబాద్ మండలం చిన్న గోల్కొండలో ‘మా సంకల్పం అభివృద్ధి చెందిన భారత్’ పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించి, బ్రోచర్లను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘మన సంకల్పం.. వికసిత్ భారత్’ అంటూ ప్రజలకు ప్రతిజ్ఞ చేశారు. వికసత్ భారత్ లో భాగంగా.. నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన వివరాలను పార్టీ నాయకులు వెల్లడించారు. ఇవాళ ఉదయం 10:45 గంటలకు కాచిగూడ, నింబోలి అడ్డా లో జరిగే వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 11:45 గంటలకు ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో వాల్ రైటింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక మధ్నాహ్నం 2:45 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ లో జరిగే వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
మరోవైపు నిన్న వికారాబాద్ జిల్లా అనంతగిరి కిషన్ రెడ్డి పర్యటించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అనంతగిరి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం 100కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతగిరి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకునేందుకున్న అనంతరం ధారూర్ మండలం కోట్ పల్లి ప్రాజెక్టులో బోటింగ్ లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో హైదరాబాద్ కు అత్యంత దగ్గరగా ఉన్న అనంతగిరి అడవుల్లో పర్యాటక అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి భారతదేశంలో ఉన్న సౌకర్యాలు మరే దేశంలోనూ లేవన్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా పర్యాటక రంగాన్ని ప్రైవేట్ సెక్టార్ కింద కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పాలసీ రూపొందించామన్నారు. మన రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. తక్కువ పెట్టుబడితో టూరిజంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించి మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
Delhi: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!