Kishan Reddy: మోడీ పని రాక్షసుడు.. ఆయన నిద్రపోరు.. మమ్మల్ని నిద్రపోనివ్వరు..
Kishan Reddy: తొలి విడతలో పోలింగ్ తగ్గిన తరువాత మోడీ కొన్ని సూచనలు చేశారు అని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. అపార్మెంట్స్ వాసులకు రిక్వెస్ట్ చేయమని మోడీ చెప్పారు.. కాలనీ, అపార్ట్మెంట్ వాసులతో సమావేశం కావాలని చెప్పారు.. వారందరూ ఓటింగ్ లో పాల్గొనాలని కోరుతూ.. ఇతరులను కూడా పాల్గొనేలా చేయాలని మోడీ సూచించారు అని తెలిపారు. ఇక, మోడీ పని రాక్షసుడు.. ఆయన నిద్రపోరు.. మమ్మల్ని నిద్రపోనివ్వరు అంటూ ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మోడీ లాంటి వ్యక్తి దేశానికి అవసరమైన నాయకుడు.. సెలవు ఉంది కదా అని ఓటెయ్యకుండా ఉండకండి.. ఓటేసి సెలవు తీసుకోండి అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Rajnath Singh: బీజేపీ ఎప్పటికీ రాజ్యాంగాన్ని మార్చదు.. రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
ఈ ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నానని కిషన్ రెడ్డి అన్నారు. దేశ భవిష్యత్త్ కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ గౌరవం కోసం ఓటేయాలన్నారు. అనేక సంవత్సరాలుగా బీజేపీ తెలంగాణలో పని చేస్తోంది.. ఇవాళ ఉన్నటువంటి సానుకూల వాతావరణం గతంలో ఎన్నడూ కనిపించలేదు.. మహిళలు, యువకులు, రైతులు, మధ్య తరగతి ప్రజలు బీజేపీకి అండగా నిలుస్తున్నారు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మా పార్టీకి ఆదరణ పెరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఓ సునామీ లాంటి అండర్ కరెంట్ క్షేత్రస్థాయిలో కనబడుతోంది.. జూన్4న వెలువడే ఫలితాల్లో ఈ ప్రభంజనాన్ని చూస్తారు.. దేశానికి ఏయే పార్టీలు ఏం చేశాయనే అంశంపై విస్తృతంగా చర్చ జరగాలి.. ఆ ప్రాతిపదికనే ఓట్లేయాలి.. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి మోడీ ప్రధాని కాకముందు.. మోడీ ప్రధాని అయిన తర్వాత వచ్చిన మార్పులను ప్రజలు చర్చించాలి అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Britney Spears Divorce: మూడోసారి విడాకులు తీసుకున్న స్టార్ సింగర్!
ఇక, పదేళ్లకు ముందు దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం, ఆర్థిక సంక్షోభం, అవినీతి కుంభకోణాలు రోజూ పేపర్ల బ్యానర్లలో ఉండేవి అని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ హయాంలో రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి.. సుప్రీంకోర్టు తీర్పు, కాగ్ రిపోర్టులే ఈ విషయాలను వెల్లడించాయి.. ఇక, 2014లో ప్రజలు రెండు అంశాలమీద ఓటేశారు.. ఒకటి అవినీతి రహిత ప్రభుత్వం.. రెండోది సమర్థ నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం రావాలని కోరుకున్నారు.. కాంగ్రెస్ అవినీతిపై ప్రజలు విసిగి వేసారిపోయారు.. అభివృద్ధి చెందాలనే ప్రజల్లో పట్టుదల కనిపించింది.. మేము అవినీతిపై కఠినంగా వ్యవహరించామని ఆయన చెప్పుకొచ్చారు. మా ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేవు.. నేడు దేశంలో మతకల్లోలాలు లేవు.. ఐఎస్ఐ కార్యకలాపాలు లేవు.. దేశంలో 32 ఏళ్ల తర్వాత 2014లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది.. 2019లో అంతకన్నా ఎక్కువ సీట్లు ఇచ్చి మోడీకి మద్దతు తెలిపారు.. కాంగ్రెస్ పార్టీ అవినీతి, బంధుప్రీతిని మేం ఈ పదేళ్లలో సరిదిద్దామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Xiaomi: తక్కువ బిల్లు, ఎక్కువ కంఫర్ట్.. మిజియా సూపర్ ఎనర్జీ సేవింగ్ 1HP ఏసీ విడుదల
-
Health Tips: స్నానం ఎప్పుడు చేస్తే మంచిది.. ఉదయం లేదా సాయంత్రం..?
-
Jammu Kashmir: శ్రీనగర్ ఎయిర్పోర్టులో ఇద్దరు అమెరికా పౌరుల అరెస్ట్..
-
Big Basket : బిగ్ బాస్కెట్ కస్టమర్లకు షాక్.. కుళ్ళిన మాంసం, ఎక్స్పైరీ డేట్ వస్తువుల సరఫరా..!
-
Tamil Nadu: తమిళనాడులో భారీ పేలుడు.. 17 మంది దుర్మరణం..
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?