Kishan Reddy: కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కి వేసినట్టే.. మజ్లిస్ చేతికి స్టీరింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: కాంగ్రెస్ కు ఓటు వేసిన BRS కి వేసినట్టే అని, ఈ రెండు పార్టీ లకి ఓటు వేస్తే మజ్లిస్ కు వేసినట్టేనని.. స్టీరింగ్ మజ్లిస్ పార్టీ చేతిలోనే ఉందని
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర సమర యోధుల ఆకాంక్షలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
రజాకార్లు, నిజాం వ్యతిరేకంగా వేలాది మంది పోరాటం చేశారని అన్నారు. ఈ ప్రాంతం భారత దేశంలో విలీనం కావాలని పోరాటం చేశారని గుర్తు చేశారు. స్వాతంత్రం వచ్చి వంద యేళ్లు అయ్యే లోపు దేశంలో పేదరికం, నిరుద్యోగం,కుటుంబ పాలన, అవినీతి ఉండకూడదని, దేశం విశ్వగురువు కావాలన్నారు. ఏ లక్ష్యం కోసం నిజాంకు వ్యతిరేకంగా, తెలంగాణ కోసం పోరాటం చేశామో ఆ లక్ష్యం నెరవేరుతుంద ఆలోచించుకోవాలని తెలిపారు. 9 సంవత్సరాల జరిగిన దోపిడీ, అవినీతి, అప్రజాస్వామిక పాలన మళ్ళీ తెలంగాణ ప్రజల మీద పడకుండా చూడాలని, ఆదమరచి ఉండకూడదన్నారు.
Read also: Asia Cup 2023: ఆసియా కప్కు నేపాల్ జట్టు ప్రకటన.. ఐపీఎల్ స్టార్కు చోటు! కెప్టెన్గా రోహిత్
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
కల్వకుంట్ల కుటుంబం మళ్ళీ అధికారంలోకి వస్తె తెలంగాణ పూర్తిగా అధోగతి పాలు అవుతుందని అన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి… మద్యం ఏరులై పారిస్తున్నారని తెలిపారు. మెజారిటీ మంత్రిత్వ శాఖలు కల్వకుంట్ల కుటుంబం చేతిలో ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల భవిష్యత్ కల్వకుంట్ల డైనింగ్ టేబుల్ మీద నిర్ణయించబడుతుందని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం వేల కోట్లు దోపిడీ చేసింది, అక్రమంగా సంపాదించిందని అన్నారు. ఏ వ్యాపారం చేసిన ఆ కుటుంబానికి 30 శాతం వాటా ఇవ్వాల్సిందే అని అన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, విశ్వవిద్యాలయాలు నీరుగారి పోయాయని, ఉద్యోగ భర్తీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు రెండేనని, ఏ మాత్రం తేడా లేదన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేసిన బీఆర్ఎస్ కి వేసినట్టేనని.. ఈ రెండు పార్టీ లకి ఓటు వేస్తే మజ్లిస్ కు వేసినట్టే అన్నారు. స్టీరింగ్ మజ్లిస్ పార్టీ చేతిలోనే ఉంటుందని కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Telangana: పంచాయతీ కార్మికులకు గుడ్న్యూస్.. బీమా సౌకర్యం కల్పించాలని సర్కార్ నిర్ణయం
తాజావార్తలు
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!