Telangana: పంచాయతీ కార్మికులకు గుడ్న్యూస్.. బీమా సౌకర్యం కల్పించాలని సర్కార్ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: తెలంగాణ సర్కార్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. పారిశుధ్య కార్మికులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పారిశుధ్య కార్మికులు మరణిస్తే వారి అంత్యక్రియలకు ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీల్లో పనిచేస్తూ మరణించిన బహుళార్థసాధక కార్మికులు (ఎంపీడబ్ల్యూ) కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.
Read also: Samantha : స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్న సమంత..
Also Read
- Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
- Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
ఈ బీమా సౌకర్యాన్ని ఎల్ఐసీ అందజేస్తుంది. కార్మికుల బీమా పాలసీ మొత్తాన్ని సంబంధిత గ్రామపంచాయతీ చెల్లిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి పారిశుధ్య కార్మికునికి ఎంత మొత్తం చెల్లించాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. సర్వీసులో ఉన్న కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అలాగే సర్వీసులో ఉన్న కార్మికులు మరణిస్తే దహన సంస్కారాలకు ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచారు. ఇప్పటి వరకు తమకు రూ. 5వేలు ఇస్తుండగా ఆ మొత్తాన్ని రూ. 10 వేలు. ఈ మొత్తాన్ని చెల్లించాలని సంబంధిత గ్రామ పంచాయతీని ఆదేశించింది. ఈ నిర్ణయాల అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్న పంచాయతీ కార్మికులు తాజాగా విధుల్లో చేరారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే బీమా సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Rice Water Health Benefits: గంజి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. ఇక వదలరు..
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!