Kishan Reddy : కేసీఆర్ పుత్ర వాత్సల్యంతో బీజేపీపై కుట్ర చేస్తూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Kishan Reddy Made Comments on CM KCR.
కేంద్ర పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అధికార టీఆర్ఎస్ పార్టీని చూస్తుంటే జాలేస్తుందని, కేసీఆర్ కుటుంబం తెలంగాణ రైతులను బలి చేస్తోందని ఆయన ఆరోపించారు. పుత్ర వాత్సల్యంతో బీజేపీపై కుట్ర చేస్తూ రైతులను ముంచుతున్నారని ఆయన విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ళపై రాజకీయం చేస్తున్నారని, చేసుకున్న ఒప్పందం ప్రకారం బియ్యం కొనుగోలు చేస్తామని కేంద్రం చెప్తోందని, రైతు పండించేది ధాన్యం మాత్రమే….రైస్ మిల్లుల్లో రా రైస్..బాయిల్డ్ రైస్ గా మారుతాయన్నారు. “రా రైస్” పంపిస్తామని అంగీకరించారు కదా..!?అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ రైతు వ్యతిరేకి అని ప్రచారం చేస్తున్నారని, పెట్రోల్ పై అన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించాయి..కేసీఆర్ ఎందుకు పన్ను తగ్గించలేదని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
తెలంగాణ రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుందని, ఉక్రెయిన్ పరిణామాల కారణంగా చమురు ధరలు పెరగడం వల్ల కేంద్రానికి నష్టం వస్తుందన్నారు. సైనిక స్కూల్, ఎంఎంటీఎస్, ట్రైబల్ మ్యూజియం సహా కేంద్రం ఇచ్చినవాటిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడం లేదని ఆయన మండిపడ్డారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేయొద్దని, కుటుంబ రాజకీయలకోసం తెలంగాణ రైతులను బలి చేయవద్దని ఆయన హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత ఆహార సంస్థ (ఏఫ్సీఐ) వడ్లను ఎక్కడా కొనదు.. బియ్యం మాత్రమే కొంటారని ఆయన వెల్లడించారు. ఆంధ్ర, తమిళనాడు, ఛత్తీస్ ఘడ్లో లేని సమస్య తెలంగాణకు ఎందుకు వస్తుందని ఆయన అన్నారు. చివరి బియ్యపు గింజ వరకు కేంద్రం కొంటుందని, రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాలపై కేసీఆర్కి కంట్రోల్ లేనట్లు ఉందని ఆయన విమర్శించారు.
కేంద్రం బియ్యం కొనుగోలు చేయదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కేసీఆర్ రైతులను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. ధాన్యం సేకరణపై ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా రైతులను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం సరఫరా చేస్తుందో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం చెప్పలేదని, హుజురాబాద్ ఎన్నిక అడ్డు పెట్టుకుని కుటుంబ ప్రతిష్ట నిలబెట్టు కోవాలనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. “బెంగాల్ మోడల్ “ ను కేసీఆర్ అవలంబించాలని అనుకుంటున్నారని, సమావేశానికి మా కేంద్రమంత్రి రమ్మన్నారు….పార్లమెంట్ లో ఉన్నాను, కాబట్టి రాలేకపోయాను, ప్రజలను, రైతులను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..