Kishan Reddy: ఫామ్ హౌజ్ సీఎం కరోనా ప్రభావం గురించి మర్చిపోయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాజకీయ వేడి పెరగుతోంది. వరసగా జాతీయ నాయకులు వచ్చి బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువు ఉండగానే… రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటీవల రాహుల్ గాంధీ వరంగల్ లో బహిరంగ సభ నిర్వహిస్తే… తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తుక్కుగూడ లో బహిరంగ సభలో పాల్గొన్నారు.
ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. ఇరు పార్టీలు పోటాపోటీగా విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి అధికార టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ఫామ్ హౌజ్ సీఎం, ఆయన కుటుంబానికి గత కొన్ని ఏళ్లుగా ప్రపంచాన్ని కరోనా వణికించిన సంగతి మరిచిపోయారేమో అని ఎద్దేవా చేశారు.
Also Read
- Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్పై కేసు నమోదు..
- Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక విచారణ.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్?
- KCR: ‘నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయా’.. సుదర్శన్రెడ్డి మృతిపై కేసీఆర్ భావోద్వేగం!
- Peddi Sudarshan Reddy: కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన ఉద్యమ నాయకుడు.. పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే..
కరోనా ప్రభావం ఉన్నప్పటికీ.. భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అని ఆయన అన్నారు. అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించే యునికార్న్లకు భారత్ నిలయం అన్నారు. ఈ ఏడాది ఒక్క ఎప్రిల్ లోనే 8.8 మిలియన్ల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని వెల్లడించారు. ఫామ్ హౌజ్ కుటుంబం ఏదైనా మాట్లాడవచ్చు కానీ ఇది వాస్తవం అని కిషన్ రెడ్డి అన్నారు. టీకా కవరేజ్ లో, ఆరోగ్య సంరక్షణ కవరేజ్, ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కవరేజ్ భారత్ తన సత్తా కనబర్చిందని అన్నారు. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థల్లో భారత్ టాప్ లో ఉందని వెల్లడించారు. తక్కువ ద్రవ్యోల్బనం ఉన్న దేశాల్లో, కరెన్సీ విలువ తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని కిషన్ రెడ్డి అన్నారు.
- Tags
- bjp
- CM
- Indian economy
- kcr
- Kishan Reddy
తాజావార్తలు
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
Suriya 48 : ఎగ్మోర్లో జెట్ స్పీడ్లో సూర్య- టి.జె. జ్ఞానవేల్ షూటింగ్
-
Jyoti Venkatesh: అవును, రామ్గోపాల్ వర్మ, ఊర్మిళ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు..
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్పై కేసు నమోదు..
ట్రెండింగ్
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!