Kishan Reddy: గవర్నర్ ను కేసీఆర్ అవమానిస్తున్నారు.. దిగజారి మాట్లాడుతున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ ఈ రోజు ఉంటారు రేపు పోతారు కానీ..వ్యవస్థలు శాశ్వతమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను, సంప్రదాయాలను గౌరవించాలని హితువు పలికారు. గవర్నర్ ని కేసీఆర్ అవమానిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేసారు. కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. మునుగోడులో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ భయపడుతున్నారని, కొడుకును సీఎం చేయలేకపోతున్న అనే ఆందోళనలో ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబానికి మోడీ నచ్చకపోవచ్చు, కానీ దేశ ప్రజలకు మోడీ అంటే ఇష్టమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ని దేంట్లో ఆదర్శంగా తీసుకోవాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరిగిందా? రాష్ట్రంలో సమస్యలే లేవా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నిరాశ నిస్పృహ తోనే బండి సంజయ్ యాత్ర పై దాడి జరిపించారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
ప్రజాసంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో దశ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నిన్న జనగామ జిల్లాలోని దేవరుప్పుల పాఠశాలలో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే.. బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. దీంతో.. సీపీ ఏం చేస్తున్నాడంటూ బండి సంజయ్ సీరియస్ అయ్యారు. ఇంటెలిజెన్స్ వాళ్ళకు మా పాదయాత్ర తెలుసుగా పోలీసులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. దమ్ముంటే సీఎం కేసీఆర్ రాష్ర్టంలో పాదయాత్ర చేయాలన్నారు. అంతేకాకుండా.. పాదయాత్రలో మహిళ బీజేపీ కార్యకర్తలు ఉన్న కారుపై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్లతో దాడిలో కార్లు ధ్వంసమైన విషయం తెలిసిందే.
PM Narendra Modi: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ప్రధాని మోదీ బర్త్డే విషెస్
Also Read
తాజావార్తలు
-
Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!