Kishan Reddy : ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుoబoపై వ్యతిరేకత కనిపిస్తోందని, అధికార మంత్రులు ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి అందుకే బీజేపీ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యం కలిగిన వారు.. కేసీఆర్ లా ఫామ్ హౌస్ లో పడుకోవడానికి ప్రదానీ మోడీ రాష్ట్రానికి రావడం లేదని ఆయన అన్నారు. వేల కోట్లు తెలంగాణ ప్రజా సంపద దోచుకున్న కేసీఆర్ కుటుoబానికి మోడీని విమర్శించే నైతిక హక్కు లేదని, మోడీ అనేక అభివృద్ధి పనులకోసం రాష్ట్రానికి వస్తుంటే కేసీఆర్ కు రావడానికి సమయం ఉండదన్నారు కిషన్ రెడ్డి.
అంతేకాకుండా.. ఇంతకన్న దరిద్రమైన ముఖ్యమంత్రి దేశంలో ఎవరుండరని, ఫామ్ హౌస్ లో కూర్చోవడానికి సమయం ఉంటది.. మోడీ రాష్ట్రానికి వస్తే కలవడానికి సమయముండదా కేసీఆర్ అని ఆయన ప్రశ్నించారు. తొంభై రోజుల సమయం ఉంది ప్రజలు ఆలోచించాలి.. కేసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేయాలన్నారు. కేసీఆర్ హాటావో, తెలంగాణ బచావో అని ప్రజలు నినదిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తెచ్చిన పథకాల్ని పూర్తిగా వైఫల్యం చెందాయని, విద్య, వైద్యం పూర్తిగా కుంటు పడిందన్నారు. ఆర్థిక వ్యవస్థ విఫలం అయ్యిందని, ఎనభై వేల పుస్తకాలు చదివినా కేసీఆర్ తెలివి ఎక్కడ బోయిందన్నారు. ఎనభై వేల పుస్తకాలు చదివినా తెలివితో కేసీఆర్ తెలంగాణను పూర్తిగా దోపిడీకి గురి చేశాడని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఅర్ఎస్ కు ఓటేసినట్టేనని, ఎలాగో గెలవరు కాబట్టి ఇష్టమొచ్చిన హామీలు ఇస్తుంది కాంగ్రెస్ అని ఆయన ధ్వజమెత్తారు.
Also Read
- Jagtial: జగిత్యాల జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సవాళ్లు.. పట్టణంలో పోస్టర్లు కలకలం
- TGSRTC JAC: ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలకు సిద్ధమైన జేఏసీ
- Uttam Kumar Reddy : రైతులకు శుభవార్త.. అధికారులకు మంత్రి ఉత్తమ్ అల్టిమేటం..!
- TGIIC Auction : హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఆల్టైమ్ రికార్డు..!
ఆరు గ్యారెంటీలు కాదు అరవై గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రాలేదని, కాంగ్రెస్ చరిత్ర దేశ ప్రజలకు తెలుసు అని ఆయన అన్నారు. అరవై యేండ్లు దేశాన్ని పాలించారు.. అడుగడుగున అవినీతితో దోచుకున్న కాంగ్రెస్ చరిత్ర ప్రజలకు తెలుసు అని, ప్రజలు ఆలోచించాలన్నారు. రేపు మోడీ పాలమూరు గడ్డపై అడుగు పెడుతున్నారని, ఘనంగా స్వాగతం పలకాలని ప్రజలను కోరుకుంటున్నారని, గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. గంట సేపు మీమీ పరిసరాల్లో శ్రమ దానం చేయాలని కోరుతున్నానని, మోడీ తెలంగాణ ప్రజలకు కానుకలు ఇవ్వబోతున్నారని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
LIC Shares: ఎల్ఐసీ షేర్స్ లో భారీ పతనం.. రూ.820 నుండి రూ.414 కు పడిపోయిన షేర్స్.. అసలు కారణం ఇదే!
-
Peddi : బెజవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. సెలబ్రేషన్స్ పీక్స్
-
Pawan Kalyan: గోదావరి పుష్కరాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కార్యాచరణ ప్రకటన..
-
Vaibhav Sooryavanshi: “రెండు సెంచరీలు మిస్.. ఫీల్ అవుతున్నావా?”.. క్వాలిఫయర్ 2కు ముందు వైభవ్ ఆసక్తికర సమాధానం..
-
Vaibhav Sooryavanshi: ఇది గమనించారా? SRHపై వైభవ్ కొట్టిన 12 సిక్సర్లలో ఓ కామన్ పాయింట్ ఉందండోయ్..
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!