Kishan Reddy : అన్ని పార్టీల నాయకులు ఒకే దగ్గర కలుసుకునే వేదిక అలయ్ బలయ్
- అలయ్ బలయ్.. రాజకీయ విభేదాలను మించే వేదిక
- సనాతన ధర్మంపై యువతలో పెరుగుతున్న ఆసక్తి
- GST తగ్గించిన మోడీ చారిత్రక నిర్ణయం
- దేశ ఏకతా కోసం అందరం అలయ్ బలయ్ కావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దసరా సందర్భంగా నిర్వహించే “అలయ్ బలయ్” కార్యక్రమ ప్రాధాన్యతను గుర్తుచేశారు. విభేదాలు ఉన్న నాయకులు కూడా ఒకే వేదికపై కలుసుకునే ప్రత్యేక వేదిక ఇదేనని ఆయన పేర్కొన్నారు.
Akshay Kumar: నా కూతురు న్యూడ్ పిక్స్ అడిగాడు.. అక్షయ్ కుమార్ సంచలనం
Also Read
“దసరా రోజున మనం ఒకరిని ఒకరు కలుసుకుని ఆశీర్వాదం తీసుకుంటాం. అదే తరహాలో అలయ్ బలయ్ కార్యక్రమం ద్వారా రాజకీయంగా విభేదించే వ్యక్తులు కూడా ఒకే వేదికపై కలుస్తారు,” అని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా దత్తాత్రేయ గారు అలయ్ బలయ్ ద్వారా అందరినీ కలిపారని ఆయన గుర్తుచేశారు. మునుపు దేవాలయాలకు వృద్ధులు మాత్రమే వెళ్తారని, కానీ ఇప్పుడు పాఠశాల విద్యార్థులు కూడా ఆసక్తిగా దేవాలయాలకు వెళ్ళి చదువుకు బయలుదేరుతున్నారని చెప్పారు. సనాతన ధర్మంపై యువతకు ఆసక్తి పెరగడం సంతోషకరమని ఆయన అన్నారు.
ప్రపంచంలో ఎవరూ GST తగ్గించలేదని, కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం పేదలకు ఊరట కలిగించేలా అనేక వస్తువులపై GST తగ్గించారని కిషన్ రెడ్డి తెలిపారు. “ధరలు పెరగడమే తప్ప తగ్గవు అనేది సాధారణ అభిప్రాయం. కానీ మోడీ గారు ధరలు తగ్గించారు. దసరా, దీపావళి పండుగల సమయంలో పేదలకు నిజమైన గిఫ్ట్ ఇచ్చారు,” అని ఆయన అన్నారు. GST ద్వారా మోడీ నిజమైన “అలయ్ బలయ్” ఇచ్చారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రాజకీయ విభేదాలు వేరుగా ఉన్నా, దేశానికి సంబంధించి అందరూ ఒకే దారిలో నడవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. “ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా మనం అలయ్ బలయ్ చేసుకున్నాం. దేశ ఏకతా, సనాతన ధర్మ పరిరక్షణ కోసం అందరం కలిసికట్టుగా నిలబడాలి. హిందూ మతం లేకుంటే దసరా ఉండదు, దేశ ఏకతా ఉండదు,” అని ఆయన అన్నారు.
Avatar 3: ‘అవతార్: స్నీక్ పీక్తో ‘ది వే ఆఫ్ వాటర్’ రీ-రిలీజ్
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!