Tummala Nageswara Rao: రేవంత్ ప్రభుత్వంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్నాం..
- రేవంత్ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకు వెళుతుంది- తుమ్మల
- అనేక ప్రభుత్వాల్లో.. శాఖల్లో పని చేసిన సమయంలో జిల్లా ఆభివృద్ధి ధ్యేయంగా పని చేశా
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్న పరిష్కరించాను- మంత్రి తుమ్మల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఏడాది కాలంలో రేవంత్ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకు వెళుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. అనేక ప్రభుత్వాల్లో.. శాఖల్లో పని చేసిన సమయంలో జిల్లా ఆభివృద్ధి ధ్యేయంగా పని చేశానని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్న పరిష్కరించానని పేర్కొన్నారు. ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించిన అధికారుల మార్పిడి, వరదల వల్ల కొంత కాలం ఇబ్బందులు ఏర్పడినప్పటికీ ఇప్పుడు పనులు స్పీడ్ అందుకున్నాయని వెల్లడించారు. 500 ఎకరాల్లో వెలుగుమట్ల ఎకో పార్క్ అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. జూ పార్క్ ను ఏర్పాటు చేస్తాం.. ఖమ్మంకు చారిత్రాత్మకమైన ఖిల్లా పై రోపు వే ఏర్పాటు చేస్తాం.. హైదరాబాద్ శిల్పారామం మాదిరిగా వెలుగుమట్ల, ఖమ్మం ఖిల్లాను తయారు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.
Read Also: 2024 Political Rewind: ఈ ఏడాది ఎన్నికల్లో కొత్తగా గెలిచిన ప్రముఖులు వీళ్లే!
Also Read
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
- Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
- Telangana : పదేళ్ల తర్వాత మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా రెపరెపలు
కొత్త ఏడాదిలో పనులు ఏర్పాటు చేస్తాం.. రూ.700 కోట్లతో మున్నేరు ఖమ్మంలోకి రాకుండా చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రూ.220 కోట్లతో చెరువుల నుంచి ఖమ్మంలోకి వరద రాకుండా చేయనున్నామని.. ఖమ్మం నగరంలో రూ.220 కోట్లతో మంచినీటి సమస్య లేకుండా పథకం తీసుకొస్తామని తెలిపారు. అలాగే.. మెడికల్ కాలేజి నిర్మాణం చేయనున్నామని చెప్పారు. స్వామి నారాయణ్ ద్వారా స్కూల్ నిర్మాణం చేస్తున్నాం.. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేస్తున్నాం.. ఖమ్మం పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేయనున్నామని అన్నారు. ఖమ్మం మున్నేరు పై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాం.. జాతీయ రహదారుల నిర్మాణం చేస్తున్నాం.. ఖమ్మంకు ఒక్క రింగ్ రోడ్డు మాదిరిగా జాతీయ రహదారుల మీదుగా చేస్తున్నామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
Read Also: Tomato Price: టమాటా ధర భారీగా పతనం.. రైతుల గగ్గోలు..
గోదావరి జలాలు పది నియోజకవర్గాలకు రావడం తన కోరిక.. దానిని పూర్తి చేయడమే లక్ష్యమని తుమ్మల చెప్పారు. సీతారామ ప్రాజెక్టు మళ్ళీ వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం నాటికి యాతల కుంట టన్నెల్ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం.. జగ్గయ్య పేట నుంచి వైరా మీదుగా నేషనల్ హైవే నిర్మాణం చేస్తామని అన్నారు. కొత్తగూడెం నుంచి కౌతల రోడ్ నిర్మాణం చేస్తే భద్రాచలం కనెక్టివిటీ పెరుగుతుందని తెలిపారు. రూ.3000 కోట్లతో సీతమ్మ సాగర్ పూర్తి అయితే.. పోలవరం నుంచి కాళేశ్వరం వరకు గోదావరిలో వాటర్ వేస్ ను చేయాలన్న కోరిక ఉందని అన్నారు. పాండురంగపురం నుంచి భద్రాచలం వరకు రైల్వే లైన్ నిర్మాణం పై కేంద్రాన్ని అడుగుతున్నాం.. ఎయిర్ వేస్ కొత్తగూడెంకు అవకాశం వుందని తెలిపారు. కొత్తగూడెం మైనింగ్ కాలేజీ యూనివర్సిటీగా చేయాలని కోరుతున్నామని మంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Instant Onion Mixture: ఈ చిట్కా తెలిస్తే బయట ఫుడ్ అస్సలు కొనరు.. కేవలం 2 నిమిషాల్లో నోరూరుంచే స్నాక్ రెడీ!
-
Nandamuri Balakrishna: ఏపీని సినీ పరిశ్రమకు రాజధానిగా తీర్చిదిద్దుతాం..!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
Telangana Govt: గుడ్న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
-
Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్! హోర్ముజ్ జలసంధిపై బిగ్ అనౌన్స్మెంట్..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?