Thummala Nageswara Rao: రాజీవ్ కెనాల్ ద్వారా సాగర్ ఆయకట్టుకు సాగునీరు..
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన
- సీతారామ ప్రాజెక్ట్ ఎత్తిపోతల పనులను పరిశీలించిన తుమ్మల
- సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2 ను పరిశీలించిన మంత్రి తుమ్మల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. సీతారామ ప్రాజెక్ట్ ఎత్తిపోతల పనులను ఆయన పరిశీలించారు. ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2ను మంత్రి తుమ్మల పరిశీలించారు. అనంతరం.. పంప్ హౌస్ 2 నుంచి గోదావరి జలాలను దిగువకు విడుదల చేశారు. ఆ తర్వాత.. కమలాపురం పంప్ హౌస్ 3ని తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కృష్ణా జలాల పంపిణీలో కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందని ఆరోపించారు. తెలంగాణకు నీటి కేటాయింపులపై కేంద్ర జలశక్తి మంత్రిని కలిసేందుకు సీఎం రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని చెప్పారు.
Read Also: Gopireddy Srinivasa Reddy: పోసానిపై 14 కేసులా..? మీరు 3 కేసులు పెడితే రేపు 30 పెట్టే సమయం ఉంది..!
Also Read
- CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
- Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
- Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గోదావరి జలాలను కృష్ణా జలతో కలపడం బృహత్తర కార్యక్రమం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.8 వేల కోట్లతో మొదలైన ఈ ప్రాజెక్టు 100 కిలోమీటర్ల పొడవైన కాలువ నిర్మాణంతో పాటు మూడు పంప్ హౌజ్లను పూర్తి చేసుకొని లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాజీవ్ కెనాల్ ద్వారా సాగర్ ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ లిఫ్ట్లతో గోదావరి జలాలు తరలిస్తామని చెప్పారు. వైరా రిజర్వాయర్కు గోదావరి జలాలు తరలింపుతో సాగర్ ఆయకట్టు స్థిరీకరణ చెందుతుందని పేర్కొన్నారు. లక్షా 30 వేల ఎకరాల్లో సాగు నీటి ఎద్దడి లేకుండా నీటి తరలింపు చేపడుతామని తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సీఎం రేవంత్ పట్టుదలగా ఉన్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shubman Gill: “నా చేతుల్లో ఏం లేదు.. ఆటపైనే దృష్టి పెడతా”.. రోహిత్ రిటైర్మెంట్ వేళ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
-
Bollywood Controversy: ‘ఈమె ఎలాంటి సీత?’.. సాయి పల్లవిపై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..
-
Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
-
Hero Surge S32: స్కూటర్ను క్షణాల్లో ఆటోగా మార్చేయొచ్చు.. హీరో Surge S32 ఎలక్ట్రిక్ వాహనం అదిరిపోయే ఫీచర్లు!
-
All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!