Site icon NTV Telugu

Khammam : భూదాన్‌ భూముల వివాదంపై సర్కార్‌ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..

Bhudan

Bhudan

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. గత నెలలో జరిగిన కూల్చివేతల వల్ల రోడ్డున పడ్డ పేదలకు అండగా నిలుస్తూ, రేపు (బుధవారం) ఖమ్మం కలెక్టరేట్ వేదికగా బాధితులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరగనుంది.

LPG Crisis: LPG కొరత వేళ, సిలిండర్ల లారీ దొంగతనం..

గత నెల 24న వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాల పేరుతో అధికారులు చేపట్టిన కూల్చివేతలు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సుమారు 15 ఏళ్ల క్రితమే తాము పట్టాలు పొందామని, తమ ఇళ్లను ఎలా కూల్చుతారని బాధితులు చేసిన పోరాటంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనిపై లోతైన సర్వే నిర్వహించిన జిల్లా అధికారులు, ప్రాథమికంగా 310 మందిని అర్హులుగా గుర్తించి వారికి టోకెన్లు కూడా జారీ చేశారు. ప్రభుత్వం కేవలం ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా, బాధితులు తమ కలల సౌధాన్ని నిర్మించుకోవడానికి ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనుంది.

Jana Sena Party Membership: జనసేన సభ్యత్వ నమోదుపై పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం..

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పేదలకు అన్యాయం జరగనివ్వబోమని, ఇది ఇందిరమ్మ ప్రభుత్వమని స్పష్టం చేశారు. భూమి లేని నిరుపేదలకు ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. వెలుగుమట్లలోని వివాదాస్పద భూమిని భవిష్యత్ అవసరాల కోసం లేదా ప్రజా ప్రయోజనార్థం ఉపయోగించాలని యోచిస్తున్న ప్రభుత్వం, బాధితులకు మాత్రం ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయంగా మెరుగైన స్థలాలను కేటాయించేలా చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో గత కొన్ని రోజులుగా ఆందోళనలో ఉన్న వందలాది కుటుంబాల్లో మళ్లీ వెలుగులు నిండనున్నాయి.

Exit mobile version