Revanth Reddy: అధికారిక వాహనాల్లో రేపులు జరిగినా మీకు పట్టదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారిక వాహనాల్లో రేపులు జరిగితే కూడా పట్టదా..? అంటూ టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో రేవంత్ మాట్లాడుతూ.. అధికారిక వాహనాల్లో కూడా అత్యాచారాలు జరిగినా చర్యలు తీసుకోవడం లేదు అంటే కెసిఆర్ ప్రోస్తహిస్తున్నట్టే అని విమర్శలు గుప్తించారు. కెసిఆర్ కో నచ్చితే నజరానా..? లేదంటే శిక్షలు అంటూ మండిపడ్డారు. కెసిఆర్..ఎంఐఎం పాలనలోనే పొత్తు కాదు, అత్యాచారాలు కూడా పొత్తు ల్లోనే చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.
వక్ఫ్ బోర్డు చైర్మన్ నీ ఎందుకు తీసేయడం లేదు కెసిఆర్ అంటూ ప్రశ్నించారు. గవర్నర్.. మోడీకి చెప్పినా.. కెసిఆర్ మాటే మోడీ, అమిత్ షా వింటారంటూ ఎద్దువ చేశారు. పిసిసి లేకున్నా.. చింతన్ శిబిర్ జరుగుతుందని, కాంగ్రెస్ వ్యవస్తాగతంగా బలంగా ఉంది అని అర్దమన్నారు. పార్టీలో ఎవరు రాకున్నా వ్యవస్థ ఆగదు, ఎవరు లేకున్నా.. పనులు ఆగవంటూ చెప్పుకొచ్చారు.
Also Read
- BRS MLAs: కేటీఆర్, హరీశ్రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి అరెస్ట్
- BRS MLC Tata Madhu Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్..
- Telangana Degree PG Colleges Bandh: నేడు డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్.. ఎందుకంటే?
- KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్
రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ సొంత అభ్యర్దిని పెడితే మోడీకి వ్యతిరేకం అని అనుకోవచ్చు.. లేదంటే.. ఏం చేసినా.. బీజేపీ కి అనుకూలమే టీఆర్ఎస్ అంటూ విమర్శించారు. ఓటింగ్ కి దూరంగా ఉన్నా.. బహిష్కరణ చేసినా బీజేపీ కి టీఆర్ఎస్ అనుకూలమే అని రేవంత్ ఎద్దువ చేశారు. కెసిఆర్ ఆర్ధిక ఉగ్రవాదంటూ ఓరేంజ్ లో కేసీఆర్ విరుచుపడ్డారు. ఆర్ధిక క్రమశిక్షణ లేదు, అందుకే తిప్పలు పడుతున్నామని రేవంత్ మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ స్పందించిన రేవంత్.. పబ్బుల మీద మెరుపు దాడులు ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాచరణ ప్రకటిస్తాము.. సమయానికి మించి నడిపే పబ్బులు పై ప్రభుత్వం దాడి చేయాలని రేవంత్ అన్నారు. ప్రభుత్వం దాడులు చేయనప్పుడు ప్రజలు దాడి చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాన్ని చూసి ప్రభుత్వం చైతన్యం పొందాలని ఎద్దేవ చేశారు.
నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఎన్టీఆర్ పేరు పెడితే తీసేసింది కెసిఆర్ కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లో అడిగితే బండ బూతులు తిట్టారు.. ఆ విషయాన్ని ఎన్టీఆర్ అభిమానులు అంత తొందరగా మర్చిపోతారా..? అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఘాట్ లో వర్ధంతి.. జయంతిలు కూడా అధికారికంగా చేయాల్సింది ఆపేశారు కెసిఆర్ అంటూ మండిపడ్డారు. సడన్ గా టీఆర్ఎస్ కి ఎన్టీఆర్ మీద ప్రేమ పుట్టింది. కెసిఆర్ వేషం..పాత పడింది.. జనం నమ్మరంటూ రేవంత్ చెప్పుకొచ్చారు. బీజేపీ హైదరాబాద్ లో సమావేశాలు పెట్టగానే అయిపోతుందా..? ఏమౌతుంది.. ఏమి కాదు అంటూ రేవంత్ ఈ సందర్భంగా టీఆర్ ఎస్, బీజేపీ, పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy: అత్తా కోడళ్ళ పంచాయతీ లెక్క.. బీజేపీ, టీఆర్ఎస్ పంచాయతీ
తాజావార్తలు
-
Theatrical Releases: ఈ వారం థియేటర్లలో అదరగొట్టబోతున్న సరికొత్త సినిమాలు..
-
Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్రూమ్లో ఏడో తరగతి బాలుడి మృతి..
-
India vs Pakistan: ఆసియా కప్లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
BRS MLAs: కేటీఆర్, హరీశ్రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి అరెస్ట్
ట్రెండింగ్
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!