Bharat Rashtra Samithi: బీఆర్ఎస్పై కేసీఆర్ ప్రకటన ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్).. ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్)గా మారిపోయింది… తెలంగాణ భవన్ వేదికగా జరిగిన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో.. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టడం.. ప్రతినిధులు దానికి ఆమోదం తెలపడం జరిగిపోయాయి.. ఇక, ఈ సందర్భంగా చేసిన తీర్మానాన్ని.. సమావేశం చివరల్లో చదివి వినిపించారు గులాబీ పార్టీ చీఫ్ కె.చంద్రశేఖర్ రావు.. భారత్ రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అక్టోబర్ 5వ తేదీ 2022న హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరిగింది… టీఆర్ఎస్ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి పార్టీగా మారుస్తూ ఏకగీవ్రంగా తీర్మానం చేసింది… ఇక, బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తుంది అంటూ చేసిన తీర్మానాన్ని చదివి వినిపించారు.. ఇక, ఆ తీర్మానంపై సంతకం చేశారు కేసీఆర్.. పలు రాష్ట్రాల నేతల సమక్షంలో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు.
Read Also: KCR National Party: టీఆర్ఎస్.. ఇక బీఆర్ఎస్..
Also Read
ఇక, ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యిందని ఆరోపణలు గుప్పించిన ఆయన.. తెలంగాణ మోడల్ దేశంలో అమలు కావాలని పిలుపునిచ్చారు.. బంగ్లాదేశ్ కంటే భారత్ వెనకపడటం ఎంటి ? అని ప్రశ్నించారు.. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జైత్రయాత్రను మహారాష్ట్ర నుంచి మొదలు పెడదామని వ్యాఖ్యానించారు.. కర్ణాటకలో మన జెండా ఎగరాలి.. అఖిలేష్ యాదవ్ ఈ సమావేశానికి రావొద్దని చెప్పాం.. ఎందుకంటే వాళ్ల నాన్న ములాయం సింగ్ ఐసీయూలో ఉన్నారని తెలిపారు.. అందరూ కలిసి వస్తారు.. బీఆర్ఎస్ సత్తా చాటుతుందన్నారు కేసీఆర్. ఈ సమావేశంలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు.. మరికొన్ని రాష్ట్రాల నుంచి నేతలు హాజరైన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?