Minister Malla Reddy: కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా గెలిపించాలి.. మల్లారెడ్డి పిలుపు
KCR Should Win As Hat Trick CM Says Minister Malla Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా గెలిపించాలని మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ స్టేట్గా తీర్చిదిద్దందన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ నీళ్లు, కరెంట్ ఇవ్వలేదని విమర్శించారు. ప్రధాని మోడీ దేశ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. కానీ.. తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. దేశ ప్రజలు సీఎం కేసీఆర్ పాలనే కోరుకుంటోందన్నారు. ఆర్నెళ్లలో మేము వస్తామని ప్రతిపక్షాలు చెప్తున్నాయని.. అసలు వారికి ఓటు అడిగే హక్కు లేదని తేల్చి చెప్పారు.
Minister KTR: డబుల్ మెజారిటీతో గెలిపించి, వాళ్లు బుద్ధి చెప్పండి.. కాంగ్రెస్పై కేటీఆర్ ధ్వజం
Also Read
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
- Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్
- Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
- AI Astrology App : AI జ్యోతిష్యం.. భవిష్యత్తు చెప్పే యాప్.!
దేశంలోనే దేశంలో ఆదర్శంగా నిలుస్తోందని.. మంత్రి కేటీఆర్ ఇతర దేశాలకు వెళ్లి, భారీగా పరిశ్రమలకు పెట్టుబడులు తీసుకొస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ప్రశంసించారు. అమెరికా తర్వాత కార్పొరేట్ ఆఫీసులకు హైదరాబాద్ హెడ్ క్వార్టర్గా మారిందన్నారు. కేటీఆర్ వల్లే రాష్ట్రానికి విదేశీ కంపెనీలు క్యూ కడుతున్నాయన్న ఆయన.. కమాండ్ కంట్రోలర్ ఆఫీసును అమెరికా, ఇంగ్లండ్, సింగపూర్ తర్వాత హైదరాబాద్లోనే నిర్మించామని అన్నారు. హైదరాబాద్లో ఎయిర్పోర్టుకు జాగాలేదని, రెండో ఎయిర్పోర్టు పాలమూరులోనే కట్టాల్సి వస్తుందని అన్నారు. 9 ఏళ్ల క్రితం పాలమూరులో నీళ్లు, కరెంటు, రోడ్లు లేవని.. కానీ ఈ తొమ్మిదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ తెలంగాణను సస్యశ్యామలం చేశారని చెప్పుకొచ్చారు.
MLA Seethakka: కేటీఆర్ ఆ మాటను బేషరతుగా వెనక్కు తీసుకోవాలి.. సీతక్క డిమాండ్
ఇదే సమయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాను ఉపాధి దొరికే జిల్లాగా మార్చామన్నారు. ప్రతిపక్ష పార్టీలు పగటి కలలు కంటున్నాయని సెటైర్లు వేశారు. మూడు గంటల కరెంట్, 200 ఫించన్ ఇవ్వడానికి మళ్ళీ మేమోస్తాని అంటున్నాయన్నారు. మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుందామని చూస్తున్నారని.. ప్రజలు తెలివితో ఆలోచించాలని కోరారు. అలాగే ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. జడ్చర్లలో 2000 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, గ్రామాల్లో 1150, మున్సిపాలిటీలో 850 ఇళ్లను నిర్మించుకున్నామని తెలిపారు. తెలంగాణ వచ్చిన తరువాత మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
-
Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!