KCR : తెలంగాణ పునర్నిర్మాణ పోరాటం మళ్ళీ చేయాల్సిందే
- ఆశపడితే మోసం చేశారు
- బీఆర్ఎస్ కేవలం 1.7శాతం తేడాతో ఓడింది...
- రియల్ ఎస్టేట్ పడిపోయింది
- రైతులకి ఇస్తామన్న బోనస్ బోగస్ అయింది : కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అన్నీ కోల్పోయామని బాధపడుతున్నారని, తెలంగాణ పునర్నిర్మాణం కోసం మరోసారి పోరాడాల్సిన సమయం వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. జగిత్యాల బహిరంగ సభలో ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం 1.7 శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయిందని కేసీఆర్ గుర్తు చేశారు. “కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఏదైనా చేస్తారని ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాను. కానీ, వీళ్లు ఒక్కటంటే ఒక్కటైనా నిర్మాణాత్మకమైన పని చేశారా?” అని ప్రశ్నించారు. ప్రజలు ఆశపడి ఓటేస్తే, కాంగ్రెస్ వారిని నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు.
Supreme Court: ఉచిత పథకాలపై కేసు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీం కోర్టు..
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
రైతుల పరిస్థితి రాష్ట్రంలో దారుణంగా మారిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. “దుకాణాల్లో యూరియా లేదు కానీ యాప్లో వస్తుందట. యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెడుతున్నారు. రైతుబంధు రావాలంటే కేసీఆర్ సభ పెట్టాలా? రైతులకు ఇస్తామన్న బోనస్ కాస్త ‘బోగస్’ అయింది. మొక్కజొన్న కొనుగోలు చేసే దిక్కు లేదు” అని ధ్వజమెత్తారు. వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టే విషయంలో ప్రభుత్వం ఇప్పటికే సంతకాలు చేసిందని ఆయన ఆరోపించారు.
హైడ్రా (HYDRAA) పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న తీరుపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. “ఏమిటి ఈ కూల్చివేతలు? కనీసం పిల్లల పుస్తకాలు కూడా తీసుకోవనివ్వరా? మేము అధికారంలోకి రాగానే మొట్టమొదట హైడ్రాను పీకి పారేసే ఫైలు మీదనే సంతకం చేస్తాను” అని హామీ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు నిజామాబాద్ పోయి ‘నిడ్రా’ తెస్తానంటున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని, చేనేత కార్మికుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. “మేము ఉద్యోగులకు 72 శాతం పీఆర్సీ ఇచ్చాము, కానీ వీళ్లు 7 శాతం కూడా ఇవ్వలేకపోతున్నారు. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు 12 వేల కోట్లకు చేరాయి. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ పోయించే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదు” అని విమర్శించారు.తెలంగాణ సమాజం ఇప్పుడు ఒక గందరగోళంలో ఉందని, ప్రజల పక్షాన నిలబడి ఈ ‘దరిద్రపు పాలన’పై పోరాడుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.
KCR: కేసీఆర్ స్పీచ్.. దద్ధరిల్లిన సభా ప్రాంగణం.. ఉప్పొంగిన ఉత్సాహం..
తాజావార్తలు
-
Rajasthan: రాజస్థాన్లో ఇసుక తుఫాన్ బీభత్సం.. బెంబేలెత్తిపోయిన ప్రజలు
-
Crime Comedy Movie : మనుషులను బురిడీ కొట్టించే గొర్రెల మంద… హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న క్రైమ్ కామెడీ
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధం.. పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్లో పేరు..
-
IT to Auto-driver: ఐటీ ఉద్యోగం వదిలి ఆటోడ్రైవర్గా మారి.. ఒక మహిళ కథ వైరల్..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..