కార్వీ ఎండీ పార్థసారథిని… చంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు సైబరాబాద్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ పోలీసులు. పీటీ వారంట్ వేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఈనెల 9 వరకు పార్థసారథిని కస్టడీకి అనుమతించింది కోర్టు. మరోవైపు ఇవాళ జైలులో ఈడీ విచారణ ముగిసింది. ఈడీ విచారణ ముగిసిన తర్వాతే పార్థసారథిని కస్టడీలోకి తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. కాగా, కార్వీ కన్సల్టెన్సీ అక్రమాలను పాల్పడినట్టు అభియోగాలున్నాయి.. రూ.780 కోట్లు ఖాతాదారుల నెత్తిన కుచ్చుటోపీ పెట్టినట్లు నిర్ధారించారు. రూ.720 కోట్ల షేర్లను తనఖా పెట్టి రుణం పొందినట్లు విచారణలో వెల్లడైంది.. రూ.1200 కోట్లు బ్యాంకులకు రుణం ఎగవేశారు. కార్వీ చీటింగ్ మొత్తం రూ.207 కోట్లుగా తేల్చారు పోలీసులు. కార్వీ ఆస్తుల మొత్తాన్ని బ్యాంకుల్లో కుదువపెట్టారు పార్థసారథి. రూ.13 కోట్ల లిక్విడ్ క్యాష్ను గుర్తించారు. ఇప్పటికే పోలీస్ కస్టడీలో కొన్ని ఆధారాలు సేకరించారు. రూ.780 కోట్లను కొనుగోలు చేశారు పార్థసారథి. షేర్లలో పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు చెబుతున్నారు. మరోసారి పార్థసారథిని విచారించనున్నారు సైబరాబాద్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ పోలీసులు .