Karminagar : సార్ మా పిల్లి బావిలో పడింది.. అర్థరాత్రి కరీంనగర్ సీపీకి ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్థరాత్రి సమయం 12 గంటలు…. సాధారణంగా అందరు నిద్రకు ఉపక్రమించే సమయం. ఆ సమయంలో పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిందంటే ఏదో సంఘటన జరిగి ఉంటుందని ఆందోళన చెందుతారు. అటువంటి సమయంలో సరిగ్గా అర్ధ రాత్రి 12 గంటలకు కరీంనగర్ సీపీ సత్యనారాయణ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసిన వ్యక్తి, కరీంనగర్ సీపీతో ‘సార్ మా ఇంటిలో ఉన్న బావిలో పిల్లి పడిపోయింది. దానిని కాపాడడానికి సహాయం చేయండి’ అని అన్నారు. మామూలుగా రకరకాల పని ఒత్తిడిలో రోజంతా గడిపిన పోలీసులు, రాత్రి సేద తీరే సమయానికి, ఇటువంటి ఫోన్ కాల్ విన్న తర్వాత అసహనానికి గురై ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. కానీ మాకెందుకులే అని దాట వేయకుండా, ఫోన్ చేసిన వారిపై అసహనం వ్యక్తం చేయకుండా వెంటనే స్పందించి టౌన్ ఏసీపీ తుల శ్రీనివాస రావు కి ఫోన్ చేసి, కాలర్ తో అత్యవసరంగా మాట్లాడి, ఆ పిల్లిని రెస్క్యూ చేయమని ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా వాట్సాప్ లో వారి లొకేషన్ మరియు కాంటాక్ట్ నెంబర్ కూడా కరీంనగర్ టౌన్ ఏసిపి కి షేర్ చేయడంతో…..టౌన్ ఏసీపీ, ఆ ఏరియా లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అంజి రెడ్డి మరియు సిబ్బందిని రెస్క్యూ టీం గా ఏర్పాటు చేసి, అర్జెంటుగా ఆ స్థలానికి వెళ్లి ఆ పిల్లి ని కాపాడే ప్రయత్నం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.
అక్కడికి చేరుకున్న పోలీస్ రెస్క్యూ టీం అంజి రెడ్డి హెడ్ కానిస్టేబుల్ మరియు సిబ్బంది బావిలోకి ఒక బుట్టను తాడు సహాయంతో పంపించి, ఆ బుట్టలో పిల్లి కూర్చునే విధంగా ప్రయత్నించి… పిల్లి బుట్టలో కూర్చున్న తర్వాత దాన్ని సురక్షితంగా పైకి లాగి రక్షించడం జరిగింది. అయితే.. సమయం అర్ధరాత్రి 12:30 మరియు 12:45 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. పోలీసులు సంతోషంతో పిల్లిని యజమానికి అప్పగించగా, ఆ పిల్లి యజమాని ఆనందంతో పోలీసు లకు కృతజ్ఞతలు తెలపాడు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… ఆపదలో ఉన్న సమయంలో ప్రజలు అర్ధరాత్రి ఎన్ని గంటల కైనా డయల్ 100 నంబర్ కి కాల్ చేస్తే పోలీసులు వెంటనే స్పందించి, ఆ ఆపద నుండి కాపాడతారని , ఎల్లవేళలా పోలీసులు ప్రజల సంరక్షణ కోసం ఉన్నారని స్పష్టం చేశారు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
తాజావార్తలు
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!