Kamareddy School Bus: స్కూల్ బస్సులో పేలిన బ్యాటరీ.. బస్సులో 50 మంది స్టూడెంట్స్..
- కామారెడ్డి జిల్లా రామారెడ్డి రోడ్డులో బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ కు చెందిన బస్సులో మంటలు..
- బస్సులో బ్యాటరీ ప్రమాదవశాత్తు పేలడంతో బస్సులో వ్యాపించిన మంటలు..
- ఒక్కసారిగా భయంతో బస్సులో నుంచి బయటకు పరిగెత్తిన స్టూడెంట్స్..
- ప్రమాదం సంబంధించినప్పుడు బస్సులో సుమారు 50 మంది స్టూడెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamareddy School Bus: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ కు చెందిన బస్సులో బ్యాటరీ ప్రమాదవశాత్తు పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో భయాందోళన చెందిన స్టూడెంట్స్ భయాందోళనకు గురయ్యారు. అరుపులు కేకలు వేస్తూ భయంతో బస్సులో నుంచి బయటకు పరుగులు పెట్టారు. కాసేపు ఏం జరుగుతుందో స్థానికులు అర్థం కాలేదు. ప్రమాదం సంబంధించినప్పుడు బస్సులో సుమారు 50 మంది స్టూడెంట్స్ ఉన్నట్లు సమాచారం.
Read also: MSME Policy: ఎంఎస్ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యాంశాలు ఇవే..
Also Read
- Kamareddy: ఎంతకు తెగించార్రా.. నగలు తీసేందుకు సమయం లేక.. ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లిన దొంగలు(వీడియో)
- Illicit Affair: మహిళతో అన్న అక్రమ సంబంధం.. పెళ్లి కోసం చంపేసిన తమ్ముడు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం.. పశువులపై వరుస దాడులు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. ప్రత్యర్థి కుటుంబంపై ట్రాక్టర్తో దాడి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ కు చెందిన బస్సు రోజూలాగానే విద్యార్థులను ఎక్కించుకుని బయలు దేరింది. బస్సులో సుమారు 50 మంది విద్యార్థులు వున్నారు. అయితే రామారెడ్డి రోడ్డుపై రాగానే ఒక్కసారిగా బస్సులు పొగలు వ్యాపించాయి.. అంతలోనే మంటలు చెలరేగాయి. విద్యార్థులు భయంతో అరుపులు కేకలు వేశారు. బస్సు డ్రైవర్ వెంటనే బస్సును ఆపేశాడు. విద్యార్థులు భయంతో కిందికి పరుగులు పెట్టారు. బస్సులో వున్న బ్యాటరీ ప్రమాదవశాత్తు పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అయితే బస్సుల డ్రైవర్ వెంటనే బస్సు ఆపడంతో ప్రమాదం తప్పింది.
ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే బస్సులో మంటలు వ్యాపించాయన్న సమాచారంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందారు. వెంటనే స్కూల్ వద్దకు చేరుకుని స్కూల్ యాజమాన్యం, బస్సు డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా స్కూల్ యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఇందతా జరగిందని బస్సును పరిశీలించి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగేవి కావని తెలిపారు. ఇప్పటికైనా యాజమాన్యం బస్సులను పరిశీలించిన తరువాతే డ్రైవర్ పిల్లలను బస్సులో ఎక్కించాలని డిమాండ్ చేశారు.
Sangareddy: ఆకలి అంటే దొంగకు అన్నం పెట్టారు.. సంక్రాంతి సినిమాకు మించిన సీన్
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!