Sangareddy: ఆకలి అంటే దొంగకు అన్నం పెట్టారు.. సంక్రాంతి సినిమాకు మించిన సీన్
- సంగారెడ్డి జిల్లాలో అరుదైన ఘటన..
- దొంగకు అన్నం తినిపించిన వైనం..
- తరువాత పోలీసులకు అప్పగించిన యువకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy: సంక్రాంతి సినిమా అందరికీ గుర్తు ఉంటుంది. ఎందుకంటే కుటుంబ సమేతంగా చూడతగ్గ సినిమా కాబట్టి. అందులో వెంకటేష్ హీరోగా నటించగా.. తల్లిగా శారదా నటించారు. అయితే వెంకటేష్ ఉంటున్న ఇంట్లోకి ఓ దొంగ (కమేడియన్ బేతా సుధాకర్) దొంగతనానికి వస్తాడు. దొంగను పసిగట్టి అందరూ పట్టుకుంటారు. అతను ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అంటే వెంటేష్ తల్లిగా నటించిన శరదా అన్నం తీసుకుని వచ్చి అన్నం పెట్టే సీన్ అప్పట్లో హైలెట్ అనే చెప్పాలి. అలాంటి సీన్లు సినిమాకి మాత్రమే పరిమితం అనుకునే వారికి సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనే నిదర్శనం.
Read also: CV Anand: వచ్చే ఏడాది నుంచి పద్ధతి మారాలి.. భక్తులకు సీవీ ఆనంద్ విజ్ఞప్తి
Also Read
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
- Kalvakuntla Kavitha: ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే.. ఫ్లెక్సీలు తొలగిస్తారా?
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం గ్రామంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇళ్లలోకి చొరబడి వరుస చోరీలకు పాల్పడుతున్న గణేష్ అనే దొంగను స్థానికులు పట్టుకున్నారు. కొద్ది రోజులుగా తాళాలు వేసి ఉన్న ఇళ్లపైనే ఇతను టార్గెట్గా దొంగతనాలు చేస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో దొంగను రెడ్హ్యాండెడ్గా పట్టుకునేందుకు పథకం వేశారు. ఊహించినట్లుగానే స్థానికులు పన్నిన వలలో గణేష్ అనే దొంగ చిక్కాడు. ఇంకేముంది.. పట్టుకున్న వెంటనే ఆగ్రహంతో ఊగిపోయిన యువకులు.. అక్కడ గణేష్ను స్తంభానికి కట్టేసి చితకబాదారు. అయితే.. కాసేపటి తర్వాత గణేష్ తనకు ఆకలిగా ఉంటుందని దీనంగా అడగడంతో అక్కడే వున్న యువకుల మనసు కరిగిపోయింది. ఎంత దొంగ అయినా.. ఆకలితో ఉన్నవాడి కడుపు నింపడం ధర్మం అనుకుని.. అప్పటిదాకా కొట్టిన చేతులతోనే దొంగకు అన్నం తినిపించి కడుపు నింపారు.
Read also: Road Accident: తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు.. 5 గురు మృతి, పలువురికి గాయాలు.
అక్కడ ఓ యువకుడు గణేశుడికి నైవేద్యంగా పెట్టే పులిహోరను పళ్లెంలో తెచ్చి స్వయంగా గణేషే (దొంగ)కి తినిపించాడు. ఆ తర్వాత మంచినీళ్లు కూడా తాగించాడు. అనంతరం దొంగ వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో కూడా
గణేష్ ఆలయాల్లోని హుండీల నుంచి డబ్బులు దోచుకునేవాడని తెలిపారు. ఆ తర్వాత యువకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులు గణేష్ ను వారికి అప్పగించారు. కోపంలోనూ కరుణ చూపిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఆ యువకులు చూపిన ధర్మాన్ని, మానవత్వాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
Powerful Dance: నడి రోడ్డుపై డాన్స్ చేసిన హీరోయిన్.. వీడియో వైరల్..
తాజావార్తలు
-
Romantic Movie OTT: థియేటర్లలో దేకలే… ఓటీటీలో మాత్రం ఊపేస్తున్న తెలుగు రొమాంటిక్ మూవీ
-
Peddi Breakeven Target : రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
-
Job News: ఏడాదికి రూ.55 లక్షల భారీ ప్యాకేజీ.. నోటిఫికేషన్ ఔట్.. ఇలా అప్లై చేసుకోండి!
-
Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!