Etela Rajender: జైలు నుండి విడుదలైన కమలాపూర్ బీజేపీ నాయకులు.. ఈటెల ఘన స్వాగతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender: జైలు నుండి విడుదలైన కమలాపూర్ బీజేపీ నాయకులకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘనస్వాగతం పలికారు అనంతరం వారిని సన్మానించారు. ఈనేపథ్యంలో.. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. 20ఏండ్లుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం ఉందని అన్నారు. పార్టీలు వేరైనా ప్రజలంతా కలిసి మెలిసి పనిచేసుకునే పద్ధతి ఉన్న నియోజకవర్గం హుజూరాబాద్ అని కొనియాడారు. అధికారం ఎవరీ శాశ్వతం కాదని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు జాగ్రత్త అని హెచ్చరించారు. చిల్లర వేశాలు మానాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల మనస్సు గెలువాలని స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు కేసులకు భయపడరని తెలిపారు. తన నియోజకవర్గ ప్రజలపై కేసీఆర్ పగపట్టారని ఆరోపించారు. అందుకే చాలా మందికి హుజూరాబాద్ లో లైసెన్స్ తుపాకులు ఇచ్చారని మండపిడ్డారు. పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి తోత్తులుగా మారారని ఆరోపణలు గుప్పించారు. మా నాయకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఈటెల రాజేందర్.
అయితే జనవరి 30న మంత్రి కేటీఆర్ కమలాపూర్ పర్యటన సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.. కాగా..మంత్రి కేటీఆర్ పర్యటన 24 గంటల ముందే బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు అక్రమంగా తరలించడంపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. అయితే.. మంత్రి పర్యటనను బీజేపీ ఆధ్వర్యంలో అడ్డుకోవడానికి ఎలాంటి పిలుపునివ్వకపోయినా అక్రమంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించడం తగదని మండిపడ్డారు. ఇక తెలంగాణలో స్వేచ్ఛ వాతావరణం లేకుండా పోయిందని, రాష్ట్రంలో కేసీఆర్ పోలీసులు లేకుండా ఒక్క అడుగు కూడా వేసే పరిస్థితి లేకుండా పోయిందని ఈటెల రాజేందర్ మండిపడిన ఆయన ఇంతలా నిర్బంధాలు, అరెస్టులతో ప్రతిపక్షాలను భయపెట్టాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. ఇక.. బీఆర్ఎస్ నేతల పర్యటన అనగానే ప్రతిపక్ష పార్టీ నేతలను అరెస్టు చేయడం ప్రభుత్వం అలవాటుగా మార్చుతుందని, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ సర్కార్ కూని చేస్తుందన్నారు. కాగా.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అనేక హామీలు, వాగ్దానాలు గుప్పించిందని.. తీరా ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. దీంతో.. నియోజకవర్గంలో గతంలో కట్టించిన బిల్డింగులకు ఇప్పుడు శిలాఫలకాలు వేసుకొని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సిగ్గుచేటు అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
-
Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!