Warangal: వైభవంగా కాకతీయ ఉత్సవాలు.. పాల్గొన్న 22వ యువరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభించేందుకు కాకతీయ 22వ యువరాజు కమల్చంద్ర భంజ్దేవ్ ఓరుగుల్లు చేరుకున్నారు. అయితే.. ముందుగా ఆయన హనుమకొండలోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల నేపథ్యంలో.. మొట్టమొదటిసారి ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, అమ్మవారి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా కమల్చంద్ర భంజ్దేవ్ మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
కాకతీయ 22వ యువరాజు కమల్చంద్ర భంజ్దేవ్ ను అంతకుముందు మంత్రులు శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్లు కమల్చంద్ర భంజ్దేవ్కు ఘనస్వాగతం పలికారు. నేటినుంచి ఓరుగల్లు కోటలో వారం పాటు జరగనున్న కాకతీయ వైభవ సప్తాహాన్ని కమల్చంద్ర ప్రారంభించనున్నారు. ఓరుగల్లు వేయిస్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, పద్మాక్షీ గుట్ట, కాకతీయ తోరణాన్ని సందర్శించనున్నారు. ఈవేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు నాటకాలు, సదస్సులు, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే.. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని మరోమారు ప్రపంచానికి చాటేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈనేపథ్యంలో.. నేటి నుంచి ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
తెలంగాణా ఏర్పడిన తర్వాత తొలిసారి:
అయితే.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరిసారిగా 2012 డిసెంబర్ 21 వ తేదీ నుంచి మూడు రోజులపాటు కాకతీయ ఉత్సవాలను నిర్వహించారు. కాగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2017- 2018 లో ఓరుగల్లు కళావైభవం పేరుతో ఉత్సవాలు కొనసాగి, రామప్ప దేవాలయం నిర్మించి 800 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈనేపథ్యంలో తాజాగా కాకతీయ వైభవ సప్తాహం పేరుతో మరోసారి నేటి నుండి ఈ నెల 13వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
వేడుకల షెడ్యూల్ ఇలా
నేడు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మాదాపూర్ లో ఛాయాచిత్ర ప్రదర్శన ఆవిష్కరణ ఉత్సవం జరుగుతుంది. రేపు 8వ తేదీ వేయిస్తంభాల దేవాలయంలో సాయంత్రం 5 గంటలనుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎల్లండి 9వ తేదీ భద్రకాళీ బండ్ పై ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. ఇక 10న పబ్లిక్ గార్డెన్ టౌన్ హాల్ లో పెయింటింగ్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు 11వ తేదీన అంబేద్కర్ భవన్ లో ఉదయం 10 గంటలకు షార్ట్ ఫిలిం ఫెస్టివల్.. అలాగే నల్గొండ జిల్లా చందుపట్ల, నకిరేకల్ లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇక 12వ తేదీన ఖిల్లా వరంగల్ లో కార్నివాల్ , ఫుడ్ ఫెస్టివల్ సాయంత్రం ఐదు గంటల నుండి నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో చివరి రోజు 13న రామప్ప ఆలయం వద్ద కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శనలతో వేడుకలకు ముగింపు పలకనున్నారు. ఈనేపథ్యంలో.. వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Harassment : మహిళలకు అసభ్యకర వీడియోలు.. దర్యాప్తులో షాకింగ్ నిజాలు..
తాజావార్తలు
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!