Jubilee Hill Bypoll : మందకొడిగా జూబ్లీహిల్స్ పోలింగ్
- ఉదయం ఓటర్ల రద్దీ తరువాత మందకొడిగా పోలింగ్
- ఐటీ ఉద్యోగులు, ప్రముఖుల గైర్హాజరు ప్రభావం
- షేక్పేట్–రహమత్నగర్–బోరబండలోనూ ఓటింగ్ మందగింపు
- ఈసారి 50% కూడా చేరుతుందా? అధికారుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ, ఓటర్లు మొదటి రెండు గంటలు.. అంటే ఉదయం 9 గంటల వరకు.. మాత్రమే కొంత ఉత్సాహంగా వచ్చి 10% ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత పోలింగ్ శాతం క్రమంగా నెమ్మదించింది. సాయంత్రం 3 గంటల సమయానికి కేవలం 40.2% మాత్రమే ఓటింగ్ నమోదైంది.
పోలింగ్ శాతం మందకొడిగా ఉండటానికి ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, ఇది ఉప ఎన్నిక కావడంతో ఓటర్లలో నిరాసక్తి ఎక్కువగా ఉంది. అలాగే, ఈ నియోజకవర్గంలో నివసించే సినీ తారలు, ప్రముఖులు గత సాధారణ ఎన్నికల మాదిరిగా పెద్దగా ఓటు వేయడానికి ముందుకు రాలేదు. చాలా మంది ప్రముఖులు నగరంలో అందుబాటులో లేకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. మరోవైపు, ఇక్కడి ఐటీ కంపెనీలు, వాణిజ్య సంస్థలు ఉద్యోగులకు సెలవు ప్రకటించకపోవడం వల్ల, వారు ఓటింగ్కు దూరమయ్యారు.
Also Read
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
ముఖ్యంగా, సంపన్నులు నివసించే జూబ్లీ హిల్స్ మెయిన్ ఏరియాతో పాటు షేక్పేట్, రెహమత్నగర్, బోరబండ వంటి ప్రాంతాల్లో కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్దగా రావడం లేదు. గత 2023 ఎన్నికలలో నమోదైన 43% ఓటింగ్ను కూడా ఈసారి చేరుకోవడం కష్టమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయినప్పటికీ, చివరి రెండు గంటల్లోనైనా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి, కనీసం 50% వరకు ఓటింగ్ పెంచడానికి అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
Raja Singh : ఢిల్లీ పేలుడుపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్
తాజావార్తలు
-
AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
-
Tollywood Exclusive: కోడి ముందా, గుడ్డు ముందా అంటే గుండె ఆగాల్సిందే!!
-
Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
-
Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
-
Tollywood: పర్సంటేజీ ఇష్యూ.. శిరీష్ రెడ్డికి మైత్రి రవి స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!