Jogu Ramanna : మూడో సారి కేసీఆర్ సీఎం కావడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జందాపుర్ నుంచి బోరాజ్ వరకు బీఆర్ఎస్ బైక్ ర్యాలీ నిర్వహించింది. అనంతరం బోరాజ్ లో జోగు రామన్న కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. మూడో సారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వాళ్లు ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్లు అధికారం లోకి వచ్చేది లేదు ఇచ్చేది లేదన్నారు. మోడీ అన్ని వర్గాలను మోసం చేసారని, మెడీ నల్ల చట్టాలు తెచ్చారన్నారు జోగు రామన్న. 4 వందలు ఉన్న గ్యాస్ ధర ను 12 వందలు చేసిన ఘనత మోడీదే అని ఆయన విమర్శించారు. ఇచ్చిన మాట తప్పకుండా మేనిఫెస్టోతో పాటు అందులో లేని వాటిని సైతం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అని జోగు రామన్న కొనియాడారు. కాంగ్రెస్ వి బట్టేవాజ్ పనులు అని, మహిళలకు కర్ణాటకలో బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారని, మగవాళ్ళు మాత్రమే బస్సు ఎక్కాలే అని బోర్డు పెట్టారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తోడు దొంగలేనని, వేశాలు మార్చి వస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపీ లకు అడ్రస్ ఉండదన్నారు జోగు రామన్న
Also Read : BHEL Recruitment : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
Also Read
- Hyderabad Horror: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
ప్రజాభీష్టానికి అనుగుణంగా సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారని, మెనిఫెస్టోలో పెట్టిన హామీల్లో కోటీ 90 లక్షల కుటుంబాలకు ధీమా కల్పించేలా రూ. 5 లక్షల బీమా అందించనున్నట్లు తెలిపారు.సౌభాగ్య మహిళా పథకం కింద అర్హులైన మహిళలకు రూ.3 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. మేనిఫెస్టోపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కర్నాటకలో బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. బీజేపీ సైతం ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేసిందని గుర్తుచేశారు. ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్, రైతులకు ఆదాయం రెట్టింపు హామీలను బీజేపీ పూర్తిగా విస్మరించిందని ఫైర్ అయ్యారు.
Also Read : RS Praveen Kumar: 10 పథకాలతో బీఎస్పీ మేనిఫెస్టో.. విడుదల చేసిన ఆర్ఎస్ ప్రవీణ్..
తాజావార్తలు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
-
US Cuba Drone Tension: ఇరాన్కు తీసిపోని క్యూబా.. అమెరికా దాడి చేస్తే భారీ రక్తపాతమే!
-
Hyderabad Horror: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!