Jeevan Reddy : పార్టీకి ఎప్పుడూ కీడు చేయలేదు.. బయటకు అందుకే వచ్చా..!
- రేవంత్పై జీవన్ రెడ్డి విమర్శలు
- కేసీఆర్ పాలనపై ప్రశంసలు
- లక్ష్యం రేవంత్ ప్రభుత్వానికి చెక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ అనుబంధాన్ని తెంచుకుని బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. జగిత్యాల వేదికగా గులాబీ జెండా పట్టుకున్న ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలన ప్రజాకంటకంగా మారిందని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తిరిగి కేసీఆర్ నాయకత్వమే అవసరమని ఆయన స్పష్టం చేశారు.
దాదాపు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తాను, ఎప్పుడూ పార్టీకి కీడు కోరలేదని జీవన్ రెడ్డి భావోద్వేగంతో చెప్పారు. అయితే, రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న కుట్రపూరిత విధానాలు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే తీరు వల్లనే తాను బయటకు రావాల్సి వచ్చిందని వివరించారు. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లోకి చేర్చుకోవడంలో రేవంత్ రెడ్డి అనుసరించిన వ్యూహాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. “రేవంత్ రెడ్డి ఆలోచనా విధానం వల్ల కాంగ్రెస్కే ప్రమాదం ఉంది, అందుకే ఆయన్ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది” అని ఎద్దేవా చేశారు.
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
Chiranjeevi: “గుండె ఎడమ వైపు కాదు.. కుడి వైపు! ‘చిరంజీవి’ మూవీ షాకింగ్ కాన్సెప్ట్!
గతంలో తాను శాసనసభలో, మండలిలో కేసీఆర్ విధానాలను ప్రశ్నించినప్పటికీ, అవి నిర్మాణాత్మకమైన విమర్శలేనని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనను చూస్తుంటే, “ఈయన కంటే కేసీఆర్ గారే నయం” అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోందని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ పునర్నిర్మాణంపై ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని జీవన్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి కావాలనే కాలయాపన చేస్తూ, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికల పేరుతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమైపోయాయని ధ్వజమెత్తారు.
Babu Mohan : పద్మ అవార్డు వస్తే సంతోషం, రాకపోయినా పర్వాలేదు!
జగిత్యాల నుంచి మళ్లీ పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, అభ్యర్థి ఎవరనేది అధినేత కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పారు. తన వ్యక్తిగత పదవుల కంటే, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిన రేవంత్ రెడ్డి పాలనను అంతమొందించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. “రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి” అనే నినాదంతోనే తన తదుపరి రాజకీయ ప్రయాణం ఉంటుందని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.
తాజావార్తలు
-
Early Menopause: 40ఏళ్లలోపే పీరియడ్స్ ఆగిపోతున్నాయా? లాన్సెట్ నివేదికలో కీలక విషయాలు
-
Eknath Shinde: మహారాష్ట్రలో షిండే మరో ఎత్తుగడ.. మళ్లీ హాట్ టాఫిక్ కాబోతున్నారా?
-
ఇరాన్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో ప్రపంచం మొత్తం మారిపోయింది..హార్మూజ్ తెరుచుకున్నా సీన్ మారదా?
-
Peddi : ఇదెక్కడి ట్విస్ట్.. ఇప్పట్లో ఆగేలా లేదు?
-
Maa Inti Bangaram: మా ఇంటి బంగారం పరిస్థితి ఏంటి ?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?