Bhupalpalli: సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసుల పురోగతి..
- సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగ మూర్తి హత్య కేసులో పోలీసుల పురోగతి
- మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీ ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు
- హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఆటో, రెండు బైకులు స్వాధీనం
- ఐదుగురిని అదుపులోకి తీసుకొని ప్రత్యేకంగా విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో జరిగిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగ మూర్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రాజలింగ మూర్తి భార్య సరళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకొని సీ.సీ.ఎస్ పోలీసులు ప్రత్యేకంగా విచారించారు. రాజలింగ మూర్తి హత్యకు ప్రధాన కారణంపై పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ముందుగల 319, 320, 171 సర్వే నెంబర్లోని భూమిలో తలెత్తిన వివాదాలే రాజలింగ మూర్తి హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also: Telangana: మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతర..
Also Read
- Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
- CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
- CM Revanth Reddy : కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి సాక్ష్యం.. రీ-డిజైన్ పేరుతో భారీ దోపిడీ..
- Bhupalapally: పోలింగ్ కేంద్రం వద్ద డబ్బుల కట్టల కలకలం!
319, 320, 171 సర్వే నెంబర్లోని రేణికుంట్ల సంజీవ్, వంశీ కృష్ణ అనే వ్యక్తులకు రాజలింగ మూర్తికి ఉన్న భూ వివాదమే హత్యకు దారి తీసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం తెలుస్తోంది. రేణికుంట్ల సంజీవ్, కొమురయ్య, వంశీ కృష్ణ ఫోన్ కాల్ రికార్డుల ఆధారంగా విచారణలో పురోగతి సాధించారు పోలీసులు. రాజలింగ మూర్తిపై దాడి జరిగిన తర్వాత భూపాలపల్లిలోని స్థానిక బీఆర్ఎస్ నేతకు ఈ ముఠా సభ్యులు ఫోన్ చేశారు. అతనికి నిందితులకు దగ్గర సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ హత్యలో బీఆర్ఎస్ నేత పాత్ర పై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజలింగమూర్తి హత్యలో మరి కొంతమంది పాత్రపై పోలీసులు విచారణ చేస్తున్నారు. రాజలింగమూర్తి హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారి సంఖ్య ఐదుగురైన.. పరోక్షంగా మరి కొంత మంది సహకరించారనే వివరాలను పోలీసులు రాబడుతున్నారు. రేపటిలోగా రాజలింగమూర్తి హత్య కేసు కొలిక్కి తీసుకొచ్చే దిశగా పోలీసుల విచారణ కొనసాగుతుంది.
Read Also: Tesla : కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎలోన్ మస్క్ టెస్లాకు భారీ ఆఫర్లు
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!