Bhupalpalli: సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసుల పురోగతి..
- సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగ మూర్తి హత్య కేసులో పోలీసుల పురోగతి
- మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీ ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు
- హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఆటో, రెండు బైకులు స్వాధీనం
- ఐదుగురిని అదుపులోకి తీసుకొని ప్రత్యేకంగా విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో జరిగిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగ మూర్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రాజలింగ మూర్తి భార్య సరళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకొని సీ.సీ.ఎస్ పోలీసులు ప్రత్యేకంగా విచారించారు. రాజలింగ మూర్తి హత్యకు ప్రధాన కారణంపై పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ముందుగల 319, 320, 171 సర్వే నెంబర్లోని భూమిలో తలెత్తిన వివాదాలే రాజలింగ మూర్తి హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also: Telangana: మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతర..
Also Read
- Jayashankar Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. DTO పైకి దూసుకెళ్లిన బొగ్గు టిప్పర్.!
- Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
- CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
- CM Revanth Reddy : కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి సాక్ష్యం.. రీ-డిజైన్ పేరుతో భారీ దోపిడీ..
319, 320, 171 సర్వే నెంబర్లోని రేణికుంట్ల సంజీవ్, వంశీ కృష్ణ అనే వ్యక్తులకు రాజలింగ మూర్తికి ఉన్న భూ వివాదమే హత్యకు దారి తీసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం తెలుస్తోంది. రేణికుంట్ల సంజీవ్, కొమురయ్య, వంశీ కృష్ణ ఫోన్ కాల్ రికార్డుల ఆధారంగా విచారణలో పురోగతి సాధించారు పోలీసులు. రాజలింగ మూర్తిపై దాడి జరిగిన తర్వాత భూపాలపల్లిలోని స్థానిక బీఆర్ఎస్ నేతకు ఈ ముఠా సభ్యులు ఫోన్ చేశారు. అతనికి నిందితులకు దగ్గర సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ హత్యలో బీఆర్ఎస్ నేత పాత్ర పై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజలింగమూర్తి హత్యలో మరి కొంతమంది పాత్రపై పోలీసులు విచారణ చేస్తున్నారు. రాజలింగమూర్తి హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారి సంఖ్య ఐదుగురైన.. పరోక్షంగా మరి కొంత మంది సహకరించారనే వివరాలను పోలీసులు రాబడుతున్నారు. రేపటిలోగా రాజలింగమూర్తి హత్య కేసు కొలిక్కి తీసుకొచ్చే దిశగా పోలీసుల విచారణ కొనసాగుతుంది.
Read Also: Tesla : కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎలోన్ మస్క్ టెస్లాకు భారీ ఆఫర్లు
తాజావార్తలు
-
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్కు సెన్సార్ క్లియర్.. ఆ 34 నిమిషాల ఫుటేజ్కూ గ్రీన్ సిగ్నల్!
-
Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
ISRO: ఇస్రోకు షాక్.. 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా.. ఎందుకిలా?
-
Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు కోయెల్ మల్లిక్ రాజీనామా
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!