CM Revanth Reddy : కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి సాక్ష్యం.. రీ-డిజైన్ పేరుతో భారీ దోపిడీ..
- కాళేశ్వరం పై సీఎం ఆరోపణలు
- రీ-డిజైన్పై విమర్శలు
- మేడిగడ్డ కుంగిపోవడంపై వ్యాఖ్యలు
- NDSA రిపోర్ట్ ప్రస్తావన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రాజెక్టుల రీ-డిజైన్ పేరుతో తెలంగాణలో భారీ అవినీతి జరిగిందని, కమీషన్ల కోసమే ప్రాజెక్టుల పేర్లు, స్థలాలు మార్చారని ఆయన ఆరోపించారు.
2009లోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని సీఎం గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు పేరు రాకూడదనే ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రభుత్వం వాటి స్థలాలను, పేర్లను మార్చిందని మండిపడ్డారు. కేవలం ఆర్థిక లాభాలు, కమీషన్ల కోసమే ఈ రీ-డిజైన్ డ్రామా ఆడారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
Also Read
- OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
- Uttam Kumar Reddy: కమిషన్ల కక్కుర్తి వల్లే బ్యారేజీలు కూలాయి.!
- OTR : కాంగ్రెస్ నేతల పొలాల్లో మొలకలు వస్తున్నాయా?
- Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జరిగిన ప్రచారాన్ని ఎద్దేవా చేస్తూ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భుతమని ప్రచారం చేసుకున్నారు. రాజకీయ లబ్ధి పొందేందుకు అప్పటి గవర్నర్ నరసింహన్ తో హరీష్ రావు పేరును మార్చి ‘కాళేశ్వర్ రావు’ అని చెప్పించారు” అంటూ దుయ్యబట్టారు. ప్రాజెక్టు గొప్పతనం కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసమే అప్పట్లో ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.
కేసీఆర్ చేసిన అవినీతిని కాలమే గుర్తించిందని, అందుకే 2023 ఎన్నికల ముందే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని సీఎం పేర్కొన్నారు. “కేసీఆర్ పాపాలను ప్రకృతే బయటకు తీసింది. ప్రపంచ అద్భుతం అని చెప్పిన ప్రాజెక్టు గాలిలో కలిసిపోయింది” అని అన్నారు.
Inter Exam Fee: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు చెల్లింపు గడువు పెంపు..
కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని కోణాల్లోనూ విఫలమైందని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) తన నివేదికలో స్పష్టంగా పేర్కొందని సీఎం వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణం, నాణ్యత, ప్లానింగ్.. ఇలా ప్రతి విషయంలోనూ వైఫల్యాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ పర్యటనలో ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మంత్రులు, ఉన్నతాధికారులు , భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!