CM Revanth Reddy : కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి సాక్ష్యం.. రీ-డిజైన్ పేరుతో భారీ దోపిడీ..
- కాళేశ్వరం పై సీఎం ఆరోపణలు
- రీ-డిజైన్పై విమర్శలు
- మేడిగడ్డ కుంగిపోవడంపై వ్యాఖ్యలు
- NDSA రిపోర్ట్ ప్రస్తావన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రాజెక్టుల రీ-డిజైన్ పేరుతో తెలంగాణలో భారీ అవినీతి జరిగిందని, కమీషన్ల కోసమే ప్రాజెక్టుల పేర్లు, స్థలాలు మార్చారని ఆయన ఆరోపించారు.
2009లోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని సీఎం గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు పేరు రాకూడదనే ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రభుత్వం వాటి స్థలాలను, పేర్లను మార్చిందని మండిపడ్డారు. కేవలం ఆర్థిక లాభాలు, కమీషన్ల కోసమే ఈ రీ-డిజైన్ డ్రామా ఆడారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
Also Read
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జరిగిన ప్రచారాన్ని ఎద్దేవా చేస్తూ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భుతమని ప్రచారం చేసుకున్నారు. రాజకీయ లబ్ధి పొందేందుకు అప్పటి గవర్నర్ నరసింహన్ తో హరీష్ రావు పేరును మార్చి ‘కాళేశ్వర్ రావు’ అని చెప్పించారు” అంటూ దుయ్యబట్టారు. ప్రాజెక్టు గొప్పతనం కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసమే అప్పట్లో ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.
కేసీఆర్ చేసిన అవినీతిని కాలమే గుర్తించిందని, అందుకే 2023 ఎన్నికల ముందే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని సీఎం పేర్కొన్నారు. “కేసీఆర్ పాపాలను ప్రకృతే బయటకు తీసింది. ప్రపంచ అద్భుతం అని చెప్పిన ప్రాజెక్టు గాలిలో కలిసిపోయింది” అని అన్నారు.
Inter Exam Fee: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు చెల్లింపు గడువు పెంపు..
కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని కోణాల్లోనూ విఫలమైందని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) తన నివేదికలో స్పష్టంగా పేర్కొందని సీఎం వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణం, నాణ్యత, ప్లానింగ్.. ఇలా ప్రతి విషయంలోనూ వైఫల్యాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ పర్యటనలో ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మంత్రులు, ఉన్నతాధికారులు , భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!