Tesla : కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎలోన్ మస్క్ టెస్లాకు భారీ ఆఫర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tesla : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మానసపుత్రిక టెస్లా ఇప్పుడు భారతదేశంలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. టెస్లా భారతదేశంలో తన ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది. దీంతో ప్రతి రాష్ట్రం టెస్లా తన ప్లాంట్ను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ తన రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి ఎలాన్ మస్క్ కంపెనీకి భారీ ఆఫర్ ఇచ్చింది. టెస్లాను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోర్ట్ కనెక్టివిటీని, తగినంత భూమిని అందిస్తామి ప్రకటించింది. దీనికోసం నారా లోకేష్ 2024లో టెస్లా సీఎఫ్ఓను కలిశారు.
Read Also:AP Government: గ్రూప్-2 పరీక్షల్లో ట్విస్ట్.. ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ
Also Read
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
- Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
- US-Iran War: ఇరాన్కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మస్క్ ల సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మస్క్ మధ్య జరిగిన సమావేశం.. భారతదేశంలో కంపెనీ నియామక డ్రైవ్ తర్వాత, ఆంధ్రప్రదేశ్ తన ప్రయత్నాలను పునరుద్ధరించింది. రెడీ ల్యాండ్ పార్శిల్స్తో సహా అనేక ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను కూడా ఆంధ్రప్రదేశ్ రూపొందించిందని వర్గాలు తెలిపాయి. ప్రారంభంలో కంపెనీ రెడీమేడ్ కార్లను దిగుమతి చేసుకుని, ఆపై క్రమంగా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. ముంబై, ఢిల్లీలో షోరూమ్లను ప్రారంభించి వార్తల్లో కంపెనీ నిలిచింది.
Read Also:Tesla: భారత్లోకి టెస్లా కారు ఎంట్రీ.. ఒక్క కారుపై ఏకంగా రూ.14 లక్షల పన్ను?
ఈవీ ఫోర్ వీలర్లలో టాప్ లో దక్షిణాది
భారతదేశంలో అత్యధికంగా ఈవీ-ఫోర్-వీలర్ల అమ్మకాలు దక్షిణ భారతదేశంలోనే జరుగుతున్నాయని, కంపెనీ ఆంధ్రప్రదేశ్లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రం కూడా పేర్కొంది. ఈవీ అమ్మకాల గణాంకాల ప్రకారం.. దాదాపు 60 శాతం ఈవీ కార్ల అమ్మకాలు నాలుగు దక్షిణాది రాష్ట్రాలు – కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలలో జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీకి ప్రతిపాదన చేయడం ఇదే మొదటిసారి కాదు. 2017లో చంద్రబాబు నాయుడు టెస్లాతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. రాయలసీమలో 4 మెగావాట్ల సామర్థ్యం గల రెండు సౌరశక్తి నిల్వ యూనిట్లను ఏర్పాటు చేయడానికి సాంకేతిక నైపుణ్యాన్ని విస్తరింపజేస్తామని మస్క్ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..