Tesla : కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎలోన్ మస్క్ టెస్లాకు భారీ ఆఫర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tesla : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మానసపుత్రిక టెస్లా ఇప్పుడు భారతదేశంలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. టెస్లా భారతదేశంలో తన ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది. దీంతో ప్రతి రాష్ట్రం టెస్లా తన ప్లాంట్ను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ తన రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి ఎలాన్ మస్క్ కంపెనీకి భారీ ఆఫర్ ఇచ్చింది. టెస్లాను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోర్ట్ కనెక్టివిటీని, తగినంత భూమిని అందిస్తామి ప్రకటించింది. దీనికోసం నారా లోకేష్ 2024లో టెస్లా సీఎఫ్ఓను కలిశారు.
Read Also:AP Government: గ్రూప్-2 పరీక్షల్లో ట్విస్ట్.. ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మస్క్ ల సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మస్క్ మధ్య జరిగిన సమావేశం.. భారతదేశంలో కంపెనీ నియామక డ్రైవ్ తర్వాత, ఆంధ్రప్రదేశ్ తన ప్రయత్నాలను పునరుద్ధరించింది. రెడీ ల్యాండ్ పార్శిల్స్తో సహా అనేక ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను కూడా ఆంధ్రప్రదేశ్ రూపొందించిందని వర్గాలు తెలిపాయి. ప్రారంభంలో కంపెనీ రెడీమేడ్ కార్లను దిగుమతి చేసుకుని, ఆపై క్రమంగా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. ముంబై, ఢిల్లీలో షోరూమ్లను ప్రారంభించి వార్తల్లో కంపెనీ నిలిచింది.
Read Also:Tesla: భారత్లోకి టెస్లా కారు ఎంట్రీ.. ఒక్క కారుపై ఏకంగా రూ.14 లక్షల పన్ను?
ఈవీ ఫోర్ వీలర్లలో టాప్ లో దక్షిణాది
భారతదేశంలో అత్యధికంగా ఈవీ-ఫోర్-వీలర్ల అమ్మకాలు దక్షిణ భారతదేశంలోనే జరుగుతున్నాయని, కంపెనీ ఆంధ్రప్రదేశ్లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రం కూడా పేర్కొంది. ఈవీ అమ్మకాల గణాంకాల ప్రకారం.. దాదాపు 60 శాతం ఈవీ కార్ల అమ్మకాలు నాలుగు దక్షిణాది రాష్ట్రాలు – కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలలో జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీకి ప్రతిపాదన చేయడం ఇదే మొదటిసారి కాదు. 2017లో చంద్రబాబు నాయుడు టెస్లాతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. రాయలసీమలో 4 మెగావాట్ల సామర్థ్యం గల రెండు సౌరశక్తి నిల్వ యూనిట్లను ఏర్పాటు చేయడానికి సాంకేతిక నైపుణ్యాన్ని విస్తరింపజేస్తామని మస్క్ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!