Harish Rao: మన సీఎంకు.. మంత్రులకు రైతులను ఓదార్చే ఓపిక లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రులకు రైతులను ఓదార్చే ఓపిక లేదని ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్ రావు సంచలన వ్యాక్యలు చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల చింతబావి తండాలో ఎండిపోయిన పంట పొలాలను హరీష్ రావు, కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో రైతులకు ఒక హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఎలక్షన్ సమయంలో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక రైతులకు మొండి చేయి చూపిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయాయి, వడగండ్ల వానలు పడి పంట నష్టం తీవ్రంగా జరిగిందన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రులకు రైతులను ఓదార్చే ఓపిక లేదన్నారు.
Also Read
రాష్ట్రంలో 180 మంది రైతులు చనిపోయిన వారిని ఓదార్చలేని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుల ఇండ్లలోకి పోయి పార్టీలను తెచ్చుకునే టైం ఉంది కానీ.. రైతులను ఓదార్చే సమయం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం తెరవాల్సింది కాంగ్రెస్ పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టుల గేట్లు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందన్నారు. వంద రోజులు గడిచినా కూడా రైతుబంధు ఇవ్వని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎకరానికి 25వేల నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులకు 500 బోనస్ ఇస్తా అనే నమ్మబలికిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని తెలిపారు. రైతులకు 500 బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నుండి రైతులను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి మరియు మంత్రులు ఎండిపోయిన రైతుల పొలాల దగ్గరికి వెళ్లి పంటలను పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులకు కరెంటు, మంచినీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.
Gaza Crisis : సరిహద్దులో నిలిచిన ట్రక్కులు.. పెరుగుతున్న ఆకలి చావులు
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!