Train e-Tickets: క్యూఆర్ కోడ్ స్కాన్ తో ట్రైన్ టికెట్లు.. అందుబాటులోకి తీసుకొచ్చిన దక్షిణ మధ్య రైల్వే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా రైల్వే శాఖ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ప్రయాణికులు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రయాణ టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ నిబంధనలో టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ కోసం క్యూలో నిలబడాల్సిన సమయం తగ్గనుంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also read: Lok Sabha Elections 2024 : ఏప్రిల్ 19న ఎలక్షన్స్.. డ్యూటీ చేయలేమంటూ వందలాది దరఖాస్తుల వెల్లువ
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
తాజాగా దక్షిణ మధ్య రైల్వే తన రైలు ప్రయాణకుల కోసం క్యూఆర్ కోడ్ ఉపయోగించి సాధారణ రైల్వే టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే మొదటగా ఫస్ట్ ఫేస్ లో భాగంగా సికింద్రాబాద్ డివిజన్ లో ఉన్న 14 స్టేషన్లో ఉన్న 31 కౌంటర్ల వద్ద ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సదుపాయాన్ని ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే విధంగా రైల్వే శాఖ అడగులు వేసింది. జనరల్ బుకింగ్ కౌంటర్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి సెకన్ల లోనే ట్రైన్ టికెట్ పొందేల అధికారులు చర్యలు చేపట్టారు.
Also read: Inspector Rishi : ఇంట్రెస్టింగ్ గా ‘ఇన్స్పెక్టర్ రిషి’ ట్రైలర్.. భయపెడుతున్న సన్నివేశాలు..
ఇకపోతే టికెట్ తీసుకొనే సమయంలో బాగా ఎదుర్కొనే సమస్య చిల్లర. ముఖ్యంగా ఈ చిల్లర సమస్యలకు చెక్ పడేటట్లుగా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని.. సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట, వరంగల్, బేగంపేట, మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి, ఫతేనగర్ బ్రిడ్జ్, సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ స్టేషన్లో ఈ సేవలను మొదలుపెట్టింది రైల్వే శాఖ. ఇకపోతే ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జనరల్ బుకింగ్ కౌంటర్లలో మాత్రమే క్యూఆర్ కోడ్ సంబంధిత అన్ రిజర్వేషన్ సీట్లను కొనుగోలు చేసే విధంగా ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!