Jagga Reddy: ఈ జగ్గారెడ్డిని మీరే కాపాడాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy Requests KCR To Give Funds For Land: సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించిన దసరా వేడుకులకు హాజరైన ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమైక్య రాష్ట్రంలో తాను సంగారెడ్డికి ఒక ఐఐటీతో పాటు ఇంటింటికి మంజీరా నీళ్లతో పాటు ఎన్నో పనులు చేశానన్నారు. అయినప్పటికీ తనకు సంతోషం లేదన్నారు. ఎన్నికల ముందు తాను 50 వేల మందికి ప్లాట్స్ ఇప్పిస్తానని వాగ్దానం ఇచ్చానని.. తాను గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని ఆవేదన చెందారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండుంటే, కచ్ఛితంగా తానిచ్చిన మాటని నిలబెట్టుకొని ఉండేవాడనన్నారు. కేసీఆర్ పెన్షన్లు ఇస్తున్నారు కానీ, తానిచ్చే ప్లాట్ల కారణంగా 20 ఏళ్లకు సరిపడ పెన్షన్ మొత్తం ఒకేసారి వచ్చేస్తుందని అన్నారు. సంగారెడ్డి పనులన్నీ సవ్యంగా సాగాలంటే.. మీ జగ్గారెడ్డిని మీరే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఒకవేళ మీరు కాపాడుకోలేకపోతే.. తాను తన పెళ్లాం పిల్లలతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లొస్తానని జగ్గారెడ్డి సరదాగా చెప్పారు. తన ఆధ్వర్యంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీలో ఉన్న వాళ్లకు తాను ప్రతి ఒక్కరికీ రూ. 10 లక్షల విలువ చేసే ప్లాట్స్ ఇస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పుడు.. ఎవరో పది మంది ఓటు వేయనందుకు ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తే, కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తారన్నందుకే వేయలేదని ఐదేళ్ల పిల్లాడు సమాధానం ఇచ్చాడని గుర్తు చేసుకున్నారు. అంటే.. ఉద్యోగాల పేరు మీద కేసీఆర్ చిన్న పిల్లల్ని సైతం ట్రాప్ చేశారని జగ్గారెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్కి ఓ విజ్ఞప్తి చేశారు. 50 వేల ఇళ్ల కోసం నిధులు కేటాయిస్తే, తాను స్థలం చూపిస్తానని, వాటిని కొనేసి ప్రజలకు ఇచ్చేద్దామని అన్నారు.
Also Read
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
ఇక రావణాసురుడు చాలా గొప్పవాడని, సీతమ్మని ఎత్తుకెళ్లి కూడా ఏం చేయలేదని జగ్గారెడ్డి అన్నారు. రాముడు కూడా మంచోడేనని, ఆయన నంబర్ వన్ మంచోడని చెప్పారు. రావణుడు నంబర్ 2 మంచోడని పేర్కొన్నారు. దసరా సందర్భంగా రావణుడ్ని తగలబెడుతున్నామని, మనకు పాలం తగలవద్దని ప్రార్థిస్తున్నానని అన్నారు. వర్సం పడుతున్నప్పటికీ జనాలు కదలడం లేదన్న ఆయన.. సంగారెడ్డి వాళ్ళు తూటాలు పడ్డా పక్కకు జరగరంటూ కార్యక్రమానికి వచ్చిన వాళ్లలో జోష్ నింపారు.
తాజావార్తలు
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
-
Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
-
Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!