Jagadish Reddy : పీయూష్ గోయల్ దురహంకారి.. తెలంగాణపైన కక్ష సాధిస్తున్నారు
ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా సాగుతోంది. తెలంగాణలో పూర్తి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నేతలు అంటుంటే.. పరిస్థితులకు అనుగుణంగానే కొనుగోలు జరుపుతామని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి జగదీశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనేక వంకలతో తమ బాధ్యతల నుంచి తప్పించుకుంటుందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో పండిన ప్రతీ వరి గింజను కేంద్ర ప్రభుత్వం కొనాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దురహంకారి పెట్టుబడిదారుల ప్రతినిధిగా మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు.
కేంద్రం వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శంగా తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు చెప్పాల్సింది పోయి తెలంగాణ పైన కక్ష సాధిస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రమే వరి కొనాలని గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు అన్ని స్థాయిలలో తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపుతామన్నారు. ధాన్యం విషయంలో కేంద్రం సరైన నిర్ణయం తీసుకోకపోతే ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సారథ్యంలో లో రైతుల పక్షాన ఉద్యమాలు చేస్తామన్నారు.
తాజావార్తలు
-
PBKS vs LSG: ఆగని పంజాబ్ జోరు.. LSGపై భారీ విజయం.!
-
Varun Chakravarthy: వైభవ్ వికెట్తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..
-
Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?