Ramadan Iftar Feast: నేడు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు.. హాజరు కానున్న సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramadan Iftar Feast: ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ మొదటి శుక్రవారం కావడంతో ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ ఇఫ్తార్ విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి హాజరయ్యే ఇఫ్తార్ విందు ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు.
Read also: Massage Center: మసాజ్ సెంటర్ లో అడ్డంగా దొరికిపోయిన ఎస్ఐ..!
Also Read
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హోదాలో రంజాన్ తొలి శుక్రవారం కావడంతో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్న సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇఫ్తార్ విందు సందర్భంగా ముస్లిం సోదరులు నమాజ్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇఫ్తార్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ భోజన సదుపాయాలు ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, మొబైల్ టాయిలెట్లు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. రంజాన్ మాసంలో ముస్లింలకు ఎలాంటి అసౌకర్యాలు, ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సంబంధిత అధికారులను కోరారు.
Read also: PM Modi: తెలంగాణకు ప్రధాని మోడీ రాక.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు..!
రంజాన్ ఉపవాస దీక్షలు (రంజాన్ 2024) మార్చి 12 నుండి ప్రారంభమయ్యాయి. ఒక నెలపాటు ఉపవాసం ఉండి అల్లాను ప్రార్థిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదో నెలను రంజాన్ నెల అంటారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఆధ్యాత్మిక ప్రార్థనలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉపవాసం ఉంటారు. ఈ మాసంలో ఒక నెల మొత్తం ఉపవాసం ఉండడం అంత తేలికైన పని కాదు. ఎందుకంటే వారు ఆహారం, పానీయం మరియు శారీరక అవసరాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. ఖురాన్ పఠించాలి. ఇస్లాం యొక్క ఐదు సూత్రాలలో ఉపవాసం ఒకటి. స్వీయ-క్రమశిక్షణ, దాతృత్వం, ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది. కుటుంబం స్నేహితులతో కలిసి భోజనం చేస్తారు. ఏదైనా తప్పులు మరియు తప్పులు జరిగితే, వారు క్షమించమని అల్లాహ్ను ప్రార్థిస్తారు.
Odisha: బీజేపీ, బీజేడీ పొత్తు ఉందా..? లేదా..?
తాజావార్తలు
-
India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
-
Varun Tej: ‘బరి’లోకి దిగడానికి ముందే వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం! డైరెక్టర్ కండిషనే కారణమా?
-
SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
-
Peddi South Vs North: “దీపికా బికినీలు, మృణాల్ స్కిన్ షోలు మీకు ఓకేనా?”
-
Sunny Leone: అడ్డంగా బుక్కైన సన్నీలియోన్.. రంగంలోకి దిగిన సీఐడీ! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!