Odisha: బీజేపీ, బీజేడీ పొత్తు ఉందా..? లేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha: రానున్న లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్(బీజేడీ), బీజేపీల మధ్య పొత్తు ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీలు కూడా పొత్తుపై చర్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న లోక్సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగి పోటీ చేస్తుందని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, ఈ విషయంపై పార్టీ పార్లమెంటరీ నిర్ణయమే అంతిమం అంటూ ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ గురువారం అన్నారు. గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన తర్వాత సమాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆశీర్వాదం, సహకారంతో ఒడిశాలో బీజేపీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.
Read Also: SpaceX: ఎలాన్ మస్క్ “మెగా రాకెట్” ప్రయోగం.. రీ ఎంట్రీలో సిగ్నల్ లాస్ట్..
Also Read
- Sugar Shortage: దేశంలో చక్కెర కొరతా..? ధరలు పెరుగుతాయా..? క్లారిటీ ఇచ్చిన AISTA
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి షాక్.. బెయిల్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం
అయితే, ఈ ప్రకటన చేసిన రెండు గంటల తర్వాత, మా జాతీయాధ్యక్షుడు, పార్లమెంటరీ పార్టీ ఏది చెబితే అదే తుది నిర్ణయమని, నా ప్రకటన ఆధారంగా మీడియా కథనాలు చేయకూడదని ఆయన అన్నారు. అంతకుముందు ఎక్స్లో పోస్ట్ చేసిన ‘‘ఒడిశాలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’’ వ్యాఖ్యల్ని తొలగించారు. మరోవైపు బీజేడీ పార్టీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నివాసంలో పార్టీ సీనియర్ నేతలు గురువారం సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ ఒడిశా పర్యటన ఒక మార్చి 6న సమావేశం జరిగింది. ఈ సమయంలో BJD ఉపాధ్యక్షుడు మరియు ఎమ్మెల్యే దేబి ప్రసాద్ మిశ్రా అప్పుడు బిజెపితో సాధ్యమైన పొత్తు గురించి చర్చిస్తున్నట్లు అంగీకరించారు. మార్చి 10న ఒడిశా బీజేపీ నాయకులు ఢిల్లీ వెల్లడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరిందనే వార్తలు వినిపించాయి.
2008లో కంధమాల్ అల్లర్ల తర్వాత ఇరు పార్టీల మధ్య పొత్తు చెదిరిపోయింది. ఎన్డీయే కూటమి నుంచి బీజేడీ వైదొలిగింది. ఈ రెండు పార్టీలు 1998-2009 వరకు 11 ఏళ్ల పాటు పొత్తు పెట్టుకున్నాయి. 2009 వరకు మూడు లోక్సభ ఎన్నికల్లో, రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి.
తాజావార్తలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!