AV Ranganath : హైడ్రా లాంటి సంస్థ దేశంలో ఎక్కడా లేదు…
- గత ఏడాది జూలైలో హైడ్రా ఏర్పాటు చేసింది ప్రభుత్వం
- కొత్త ప్రోగ్రామ్ కాబట్టి ఇంకా తెలుసుకోవాల్సి ఉంటుంది
- సిబ్బంది తక్కువ ఉన్నప్పటికీ భాగానే చేస్తున్నాం
- హైడ్రా లాంటి సంస్థ దేశంలో ఎక్కడా లేదు : ఏవీ రంగనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AV Ranganath : హైదరాబాద్లో వరదలు, మురుగునీటి సమస్యలు, చెరువుల కబ్జాలు, పర్యావరణ సమస్యలు వంటి క్లిష్ట అంశాల పరిష్కారానికి ఒక ప్రత్యేక సంస్థ అవసరమని భావించిన ప్రభుత్వం, గత ఏడాది జూలైలో హైడ్రా (HYDRA) అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ సంస్థ పనితీరు, భవిష్యత్ దిశపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ .. “హైడ్రా లాంటి సంస్థ దేశంలో ఎక్కడా లేదు. ఇది కొత్త ప్రోగ్రామ్, కాబట్టి ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది. సిబ్బంది తక్కువ ఉన్నప్పటికీ, మేము భాగానే పనులు చేస్తున్నాం. తప్పులు జరిగితే వాటిని సమీక్షించుకుంటాం” అన్నారు.
హైడ్రా ఏర్పాటు తర్వాత ప్రభుత్వమే జిహెచ్ఎంసి యాక్ట్లో మార్పులు చేసి సంబంధిత అధికారాలు కల్పించిందని కమిషనర్ తెలిపారు. ముఖ్యమంత్రి, ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ సహకరిస్తున్నారని చెప్పారు.
Etela Rajender : నిజమైన పేదవాడు ఐదు లక్షలతో ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
వరదల్లో మురుగు నీరు సమస్యలను పరిష్కరించడం, అకాల వర్షాల సమయంలో ముందస్తు చర్యలు చేపట్టడం, పర్యావరణ పరిరక్షణ, చెరువులు–నాలాలను రక్షించడం హైడ్రా ప్రధాన లక్ష్యమని కమిషనర్ చెప్పారు. “నాలాల్లో వేలాది ట్రక్కుల పూడికతీత పనులు చేశాం. సిబ్బంది చేతనే మ్యాన్హోల్స్, నాలాలు క్లీన్ చేయించాం. డిజాస్టర్ మేనేజ్మెంట్లో కొన్ని ఫోర్కాస్ట్ ఇబ్బందులు ఉన్నా, ఇప్పుడే చేస్తున్న పనులు వచ్చే 100 ఏళ్లకు ఉపయోగపడతాయి” అని పేర్కొన్నారు. “60–65 శాతం చెరువులు మాయం అయ్యాయి. పొల్యూషన్ వల్ల అనేక సమస్యలు వచ్చాయి. వాటిని అడ్డుకోవాలి. CSR పేరుతో చెరువులు కొట్టేయాలని చూస్తే ఊరుకోం. చెరువుల మాదిరిగా నాలాలను కూడా నోటిఫై చేసి కబ్జాలను నిరోధిస్తాం” అని హెచ్చరించారు.
అలాగే, బతుకమ్మ కుంట, కూకట్పల్లి చెరువుల అభివృద్ధి పనులు చేపట్టిన తర్వాత స్థానికులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. హైడ్రా ఏర్పడి సంవత్సరం పూర్తయిందని, ఈ కాలంలో అనేక కార్యక్రమాలు అమలు చేశామని కమిషనర్ తెలిపారు. “తక్కువ మ్యాన్పవర్తో ఎక్కువ ప్రొడక్టివిటీ సాధించాం. ఇప్పటి వరకు 500 ఎకరాలను కాపాడగలిగాము” అని గర్వంగా చెప్పారు.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?