Chandrayangutta Flyover: అందుబాటులోకి చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్.. నేడు ప్రారంభించనున్న కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద నిర్మించిన చాంద్రాయణగుట్ట ఫ్లైఓవరు మంత్రి కేటీఆర్ నేడు ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. రూ.45.90 కోట్లతో 674 మీటర్ల పొడవునా ఈ ఫ్లైఓవర్ను నిర్మించగా.. ఈ ఫ్లెఓవర్ ద్వారా చాంద్రాయణగుట్టలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. SRDP ఫలాలు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజల మౌలిక అవసరాలు పూర్తి చేయడంలో బల్దియా లక్ష్యం నెరవేరే అవకాశం దగ్గరలోనే ఉంది. ఈచాంద్రాయణగుట్ట విస్తరణ ఫ్లై ఓవర్ వలన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఎల్బీనగర్ మీదుగా నల్గొండ, వరంగల్ వెళ్లేందుకు సులభతరమయ్యేందుకు ఈ ఫ్లైఓవర్ దోహదపడుతుంది.
ట్రాఫిక్ సమస్యను అధికమించేందుకు చాంద్రాయణగుట్ట వద్ద రూ. 45 కోట్ల 90 కోట్ల వ్యయంతో యుటిలిటీ షిఫ్టింగ్, భూసేకరణ కలిపి మొత్తం అట్టి వ్యయంతో ఫ్లై ఓవర్ ను చేపట్టారు. ఈనేపథ్యంలో.. ఫ్లై ఓవర్ 4 లైన్లను రెండు వైపుల 674 మీటర్ల పొడవు తో నిర్మాణం చేశారు. తద్వారా కందికల్ గేట్, బర్కాస్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఆగకుండా నేరుగా ఈ ఫ్లైఓవర్ పై నుండి వెళ్లవచ్చు. ప్రస్తుతతం ఉన్న ఫ్లైఓవర్ అప్రోచ్ చివరిలో ట్రాఫిక్ రద్దీ నివారించడానికి ఫ్లైఓవర్ ను పొడిగించడం జరిగింది. కుడి వైపున దర్గ, డిఎల్ఆర్పి, ఎడమ వైపున మసీదు, మందిర్ ఉండడం మూలంగా వాహనదారుల ప్రమాదాలను నివారించడమే కాకుండా ట్రాఫిక్ రద్దీని తొలగించడానికి ఉపయోగపడుతుంది.
Also Read
ఈ ఫ్లైఓవర్ రెండు వైపులా నిర్మానం చేపట్టిన నేపథ్యంలో ఓవైసీ జంక్షన్ మీదుగా ఎల్బీనగర్ వరకు, ఎల్బీనగర్ వరకు, ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ వైపు వెళ్లేందుకు సకాలంలో చురుటకు వీలవుతుంది. కాగా.. ఆరాంఘర్ నుండి ఎల్బీనగర్ మీదుగా ఉప్పల్ వరకు దీంతో ఏడు ఫ్లైఓవర్, అండర్ పాపులు చేపట్టారు. దీంతో.. ఆరాంఘర్ నుండి మీర్ ఆలం ట్యాంక్ వరకు నిర్మించే ఫ్లైఓవర్ జిహెచ్ఎంసీ లోనే అతి పొడవైనది దీనీ నిర్మాణ పనులు ఇంకా జరుగుతున్నాయి. ఫలక్ నుమా ఫ్లైఓవర్ త్వరలో అందుబాటులోకి రానుంది. బైరమల్ గూడకుడ, ఎడమ రెండు వైపులా.. కామినేని హాస్పిటల్ వద్ద కుండి, ఎడమ రెండు వైపులా.. ఎల్బీనగర్ వద్ద కుడి, ఎడమ వైపు అండర్ పాసులు అందుబాటులోకి రాగా.. నాగోల్ వద్ద కుడి, ఎడమ రెండు వైపులా చేపట్టిన నిర్మాణ పనులు తది దశకు చేరుకున్నాయి. నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి..ట్రాఫిక్ చిక్కుల్తో సతమతమయ్యే నగరం ఇప్పుడు ట్రాఫిక్ ఫ్రీ, సిగ్నల్ ఫ్రీ సిటీగా తనదైన అభివృద్దికి అరుదైన సాక్ష్యంగా నిలుస్తోంది.
చాంద్రాయణగుట్ట వద్ద ₹ 45.90 కోట్లతో నిర్మించిన 674 మీటర్ల పొడవైన ఫ్లై ఓవర్ను నేడు ప్రారంభించనున్నారు. హైదరాబాద్లో మరిన్ని మౌలిక సదుపాయాలను జోడించడంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డిపి) కీలకమైందని కేటీఆర్ ట్విట్ చేశారు.
Will be throwing open the 674 metre long flyover built at a cost of ₹45.90 Cr at Chandrayanagutta tomorrow
Strategic Road Development Program (SRDP) has been key to adding more infrastructure Hyderabad pic.twitter.com/doSortjosr
— KTR (@KTRTRS) August 22, 2022
తాజావార్తలు
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!