Chandrayangutta Flyover: అందుబాటులోకి చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్.. నేడు ప్రారంభించనున్న కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద నిర్మించిన చాంద్రాయణగుట్ట ఫ్లైఓవరు మంత్రి కేటీఆర్ నేడు ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. రూ.45.90 కోట్లతో 674 మీటర్ల పొడవునా ఈ ఫ్లైఓవర్ను నిర్మించగా.. ఈ ఫ్లెఓవర్ ద్వారా చాంద్రాయణగుట్టలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. SRDP ఫలాలు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజల మౌలిక అవసరాలు పూర్తి చేయడంలో బల్దియా లక్ష్యం నెరవేరే అవకాశం దగ్గరలోనే ఉంది. ఈచాంద్రాయణగుట్ట విస్తరణ ఫ్లై ఓవర్ వలన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఎల్బీనగర్ మీదుగా నల్గొండ, వరంగల్ వెళ్లేందుకు సులభతరమయ్యేందుకు ఈ ఫ్లైఓవర్ దోహదపడుతుంది.
ట్రాఫిక్ సమస్యను అధికమించేందుకు చాంద్రాయణగుట్ట వద్ద రూ. 45 కోట్ల 90 కోట్ల వ్యయంతో యుటిలిటీ షిఫ్టింగ్, భూసేకరణ కలిపి మొత్తం అట్టి వ్యయంతో ఫ్లై ఓవర్ ను చేపట్టారు. ఈనేపథ్యంలో.. ఫ్లై ఓవర్ 4 లైన్లను రెండు వైపుల 674 మీటర్ల పొడవు తో నిర్మాణం చేశారు. తద్వారా కందికల్ గేట్, బర్కాస్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఆగకుండా నేరుగా ఈ ఫ్లైఓవర్ పై నుండి వెళ్లవచ్చు. ప్రస్తుతతం ఉన్న ఫ్లైఓవర్ అప్రోచ్ చివరిలో ట్రాఫిక్ రద్దీ నివారించడానికి ఫ్లైఓవర్ ను పొడిగించడం జరిగింది. కుడి వైపున దర్గ, డిఎల్ఆర్పి, ఎడమ వైపున మసీదు, మందిర్ ఉండడం మూలంగా వాహనదారుల ప్రమాదాలను నివారించడమే కాకుండా ట్రాఫిక్ రద్దీని తొలగించడానికి ఉపయోగపడుతుంది.
Also Read
ఈ ఫ్లైఓవర్ రెండు వైపులా నిర్మానం చేపట్టిన నేపథ్యంలో ఓవైసీ జంక్షన్ మీదుగా ఎల్బీనగర్ వరకు, ఎల్బీనగర్ వరకు, ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ వైపు వెళ్లేందుకు సకాలంలో చురుటకు వీలవుతుంది. కాగా.. ఆరాంఘర్ నుండి ఎల్బీనగర్ మీదుగా ఉప్పల్ వరకు దీంతో ఏడు ఫ్లైఓవర్, అండర్ పాపులు చేపట్టారు. దీంతో.. ఆరాంఘర్ నుండి మీర్ ఆలం ట్యాంక్ వరకు నిర్మించే ఫ్లైఓవర్ జిహెచ్ఎంసీ లోనే అతి పొడవైనది దీనీ నిర్మాణ పనులు ఇంకా జరుగుతున్నాయి. ఫలక్ నుమా ఫ్లైఓవర్ త్వరలో అందుబాటులోకి రానుంది. బైరమల్ గూడకుడ, ఎడమ రెండు వైపులా.. కామినేని హాస్పిటల్ వద్ద కుండి, ఎడమ రెండు వైపులా.. ఎల్బీనగర్ వద్ద కుడి, ఎడమ వైపు అండర్ పాసులు అందుబాటులోకి రాగా.. నాగోల్ వద్ద కుడి, ఎడమ రెండు వైపులా చేపట్టిన నిర్మాణ పనులు తది దశకు చేరుకున్నాయి. నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి..ట్రాఫిక్ చిక్కుల్తో సతమతమయ్యే నగరం ఇప్పుడు ట్రాఫిక్ ఫ్రీ, సిగ్నల్ ఫ్రీ సిటీగా తనదైన అభివృద్దికి అరుదైన సాక్ష్యంగా నిలుస్తోంది.
చాంద్రాయణగుట్ట వద్ద ₹ 45.90 కోట్లతో నిర్మించిన 674 మీటర్ల పొడవైన ఫ్లై ఓవర్ను నేడు ప్రారంభించనున్నారు. హైదరాబాద్లో మరిన్ని మౌలిక సదుపాయాలను జోడించడంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డిపి) కీలకమైందని కేటీఆర్ ట్విట్ చేశారు.
Will be throwing open the 674 metre long flyover built at a cost of ₹45.90 Cr at Chandrayanagutta tomorrow
Strategic Road Development Program (SRDP) has been key to adding more infrastructure Hyderabad pic.twitter.com/doSortjosr
— KTR (@KTRTRS) August 22, 2022
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!