Shobha Karandlaje: కాంగ్రెస్ రాష్ట్రాల్లో కమిషన్ ప్రభుత్వాలు నడుస్తున్నాయి.. కేంద్రమంత్రి ఫైర్
- కాంగ్రెస్ రాష్ట్రాల్లో కమిషన్ ప్రభుత్వాలు నడుస్తున్నాయి
- కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ రాష్ట్రాల్లో కమిషన్ ప్రభుత్వాలు నడుస్తున్నాయని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారిగా కేంద్రమంత్రి నియమింపబడ్డారు. ఇందుకోసం ఆమె హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయని.. అక్కడ కర్ణాటక, ఇక్కడ తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎమ్లా మార్చుకున్నాయని ధ్వజమెత్తారు. ఇచ్చిన గ్యారంటీలను కూడా అమలు చేసే దిక్కు లేదని ఆరోపించారు. కర్ణాటకలో ప్రభుత్వ పాలన అగమ్యగోచరంగా ఉందని పేర్కొ్న్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను.. తెలంగాణలో అభివృద్ది ఎక్కడా? అని ప్రశ్నించారు. ఢిల్లీ హైకమాండ్కి పైసలు పంపాలి… హైకమాండ్ను ఖుషీ చేయాలి.. ఇదే తెలంగాణ కాంగ్రెస్ సర్కారు చేస్తున్న పని అని చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ సర్కారు కూడా ఇదే చేస్తోందని తెలిపారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 50 శాతం కమిషన్ ప్రభుత్వాలు నడుస్తున్నాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: JIGRIS : మ్యాడ్ బాయ్ రామ్ నితిన్ ‘జిగ్రీస్’ ఫస్ట్ లుక్ రిలీజ్
Also Read
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
- CM Revanth Reddy : అగ్రికల్చర్ పక్కనపెట్టి డ్రింకింగ్ కల్చర్ తెచ్చారు..
- CM Revanth Reddy : కేసీఆర్కు రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
కార్యకర్తలు, నేతల అభీష్టం మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని శోభా కరంద్లాజే తెలిపారు. ఇప్పటికే అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగిందని… మరోసారి మాట్లాడుకుంటామని చెప్పారు. మధ్యాహ్నం తర్వాత నామినేషన్ స్వీకరణ ఉంటుందని పేర్కొన్నారు. ఇది పార్టీల మధ్య రాజకీయ ఎన్నిక కాదని.. పార్టీ సంస్థాగత ఎన్నిక కాబట్టి ఏకగ్రీవమే ఉంటుందని చెప్పారు. ఘర్షణ ఉండదు… ఏకాభిప్రాయంతోనే ముందుకు పార్టీ వెళ్తుందని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Janhvi Kapoor : మీడియా పై మండిపడుతున్న జాన్వీకపూర్..
ఇక సోమవారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్రావు నామినేషన్ వేయనున్నారు. రామచందర్రావు బీజేపీలో చాలా కాలంగా క్రియాశీలంగా ఉన్న నేత. విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్, బీజేపీకి సంబంధించిన కార్యకలాపాల్లో భాగస్వామిగా ఉన్న ఆయన, హైదరాబాద్కు చెందిన ప్రముఖ న్యాయవాది కూడా. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవంతో పాటు, పార్టీలో వివిధ స్థాయిలలో నిర్వహణలో పాల్గొన్న ఆయనకు బలమైన మద్దతు ఉంది.
తాజావార్తలు
-
PoK Protests: “మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!”.. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
-
Tata Sierra EV: 665KM రేంజ్తో టాటా సియెర్రా EV లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Ravi Teja Sree Vishnu: రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ ఫిక్సా? సంక్రాంతి రేసులో దిల్ రాజు భారీ ప్లాన్!
-
Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!