Telangana Govt: తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది అని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 61.45 శాతం యాసంగి వడ్ల కొనుగోళ్లు పూర్తి అయినట్లు పేర్కొనింది. మే 12వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది అన్నారు. ఇక, 2023– 24 సంవత్సరం ఇదే సమయానికి 29.88 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి.. 2022–23లో 19.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్లు చెప్పుకొచ్చారు.
Read Also: RK Roja: ప్రభుత్వంపై రోజా సంచలన వ్యాఖ్యలు..
అయితే, గత ఏడాదితో పోలిస్తే యాసంగి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఎక్కువ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. 2023– 24లో 7,178 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఈసారి 8,245 కేంద్రాలు నెలకొల్పింది. ఈ ఏడాది యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 60.14 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.. మొత్తం 1.29 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మొత్తం 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది.