Jagadish Reddy: వాళ్లు తెలంగాణ నీళ్లను దొంగిలించుకుని పోతున్నారు..
- తెలంగాణ నీళ్లను చంద్రబాబు దొంగలించుకుని పోతున్నారు..
- రాష్ట్రంలో పరోక్షంగా చంద్రబాబు పాలన కొనసాగుతుంది..
- ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్లపై పట్టింపు లేదు: మాజీమంత్రి జగదీష్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagadish Reddy: తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో కృష్ణా- గోదావరి జలాల్లో మనకున్న వాటాను పూర్తిగా వినియోగించుకున్నారని తెలిపారు. కానీ, ఇపుడు తెలంగాణ నీళ్లను దొంగలించుకుని పోతున్నారు అని ఆరోపించారు. చంద్రబాబు ఏపీ సీఎం అయ్యాక ఈ ధోరణి మరింత పెరిగిపోయింది.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్లపై పట్టింపు లేదు అని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ లో ములుగు సీఆర్పీఎఫ్ బెటాలియన్ పోయి విశాఖ సీఆర్పీఎఫ్ బెటాలియన్ వచ్చిందన్నారు.. ఇప్పుడు సాగర్ పూర్తిగా చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోయింది.. కేసీఆర్ సీఎంగ ఉన్నాన్ని రోజులు సీఆర్పీఎఫ్ బలగాలను సాగర్ కు రానివ్వలేదు అని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి మళ్లీ షాక్..
Also Read
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
- Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
- Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
ఇక, సీఆర్పీఎఫ్కు సాగర్ను అప్పజెప్పడం అంటే తెలంగాణ చేతి నుంచి ఆంధ్రా చేతికి ఆ ప్రాజెక్టును ఇవ్వడమే అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పరోక్షంగా చంద్రబాబు పాలన సాగుతోంది.. చంద్రబాబు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వణుకుతుందో అర్థం కావడం లేదు అన్నారు. వయా చంద్రబాబు ద్వారా ఈ ప్రభుత్వం మోడీకి దగ్గరైంది అన్నారు. లక్ష మందితో కేసీఆర్ సభ పెట్టబోయే సరికి కాంగ్రెస్ ప్రభుత్వం తోక ముడిచి కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించమని అసెంబ్లీలో తీర్మానం చేసింది అన్నారు. ఇక, మంత్రివర్గ విస్తరణ జరిగితే తన పదవికి ముప్పు ఉంటుందనే రేవంత్ రెడ్డే దాన్ని ఆపుతున్నారు.. ఎలాగూ కాంగ్రెస్ మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదని ఆ పార్టీ వాళ్ళే చెబుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
-
TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్పై స్పీకర్ కీలక చర్య
-
Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
-
Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!