Bhatti Vikramarka: విద్యార్థుల భవిష్యత్త్ కోసం ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కొంటాం..
- రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్ కోసం ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కొంటాం..
- గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పాలించి మెస్ ఛార్జీలు పెంచలేదు..
- ఏడాదిలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి రూ. 5 వేల కోట్లు కేటాయించాం: భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని ఒడిదుడుకులు అయినా ఎదుర్కొంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యార్థుల భవిష్యత్త్ కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పాలించి మెస్ ఛార్జీలు పెంచలేదు.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 40 శాతం మెస్ చార్జీలు పెంచాం.. ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి ఐదు వేల కోట్లు కేటాయించామన్నారు. స్కూల్స్ ప్రారంభం కాగానే పుస్తకాలు, యూనిఫాంలు సరఫరా చేశామన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాత నెహ్రూజీ.. ఆయన నిర్ణయాలతోనే నేడు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.
Read Also: CM Revanth Reddy: 21 ఏళ్లు నిండిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి..
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
అలాగే, గుండు సూది కూడా ఉత్పత్తి చేయలేని దేశంలో పంచవర్ష ప్రణాళికలు అమలు చేసి.. రాకెట్లు తయారు చేసే స్థాయికి ఈ దేశాన్ని నెహ్రూ తీసుకు వెళ్లారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. ప్రజలు జీవించడమే కాదు గౌరవప్రదమైన హక్కులు వారికి ఉండాలని మన తొలి ప్రధాని నెహ్రూ ఆలోచనలు చేశారు.. శాస్త్రీయ విద్య, ఉపాధి కల్పనకు ఐఐటీలు, ఎయిమ్స్ వంటి సంస్థలను స్థాపించుకున్నాం.. ఆధునిక దేవాలయాలు పిలుచుకునే బహులార్ధక సార్థక ప్రాజెక్టులు ఆయన ఆలోచనలే.. కృష్ణానదిపై నాగార్జునసాగర్, గోదావరి నదిపై ఎస్సారెస్పీ ప్రాజెక్టులు నిర్మించి ఈ రాష్ట్రం మీదుగా రెండు జీవ నదులు పారించేందుకు చాచా నెహ్రూ పునాదులు వేశారని వెల్లడించారు. భిన్నత్వంలో ఏకత్వంతో ఈ దేశాన్ని నడిపారు.. అటు అమెరికా కూటమి ఇటు రష్యా కూటమికి దూరంగా అలీన విధానంతో సమదూరం పాటించి స్వతంత్రంగా వ్యవహరించి ప్రపంచ దృష్టిని మన తొలి ప్రధాని ఆకర్షించారు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!