Bhatti Vikramarka: విద్యార్థుల భవిష్యత్త్ కోసం ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కొంటాం..
- రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్ కోసం ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కొంటాం..
- గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పాలించి మెస్ ఛార్జీలు పెంచలేదు..
- ఏడాదిలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి రూ. 5 వేల కోట్లు కేటాయించాం: భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని ఒడిదుడుకులు అయినా ఎదుర్కొంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యార్థుల భవిష్యత్త్ కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పాలించి మెస్ ఛార్జీలు పెంచలేదు.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 40 శాతం మెస్ చార్జీలు పెంచాం.. ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి ఐదు వేల కోట్లు కేటాయించామన్నారు. స్కూల్స్ ప్రారంభం కాగానే పుస్తకాలు, యూనిఫాంలు సరఫరా చేశామన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాత నెహ్రూజీ.. ఆయన నిర్ణయాలతోనే నేడు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.
Read Also: CM Revanth Reddy: 21 ఏళ్లు నిండిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి..
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
అలాగే, గుండు సూది కూడా ఉత్పత్తి చేయలేని దేశంలో పంచవర్ష ప్రణాళికలు అమలు చేసి.. రాకెట్లు తయారు చేసే స్థాయికి ఈ దేశాన్ని నెహ్రూ తీసుకు వెళ్లారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. ప్రజలు జీవించడమే కాదు గౌరవప్రదమైన హక్కులు వారికి ఉండాలని మన తొలి ప్రధాని నెహ్రూ ఆలోచనలు చేశారు.. శాస్త్రీయ విద్య, ఉపాధి కల్పనకు ఐఐటీలు, ఎయిమ్స్ వంటి సంస్థలను స్థాపించుకున్నాం.. ఆధునిక దేవాలయాలు పిలుచుకునే బహులార్ధక సార్థక ప్రాజెక్టులు ఆయన ఆలోచనలే.. కృష్ణానదిపై నాగార్జునసాగర్, గోదావరి నదిపై ఎస్సారెస్పీ ప్రాజెక్టులు నిర్మించి ఈ రాష్ట్రం మీదుగా రెండు జీవ నదులు పారించేందుకు చాచా నెహ్రూ పునాదులు వేశారని వెల్లడించారు. భిన్నత్వంలో ఏకత్వంతో ఈ దేశాన్ని నడిపారు.. అటు అమెరికా కూటమి ఇటు రష్యా కూటమికి దూరంగా అలీన విధానంతో సమదూరం పాటించి స్వతంత్రంగా వ్యవహరించి ప్రపంచ దృష్టిని మన తొలి ప్రధాని ఆకర్షించారు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..