Telangana CM: తెలంగాణను చంద్రబాబు ఇరకాటంలోకి నెట్టారు..
- ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సూచనలు..
- 90 టీఎంసీలు పట్టిసీమకు తీసుకెళ్లారు.. అందులో మాకు 45 టీఎంసీలు రావాలి..
- పాలమూరు రంగారెడ్డికి నీళ్ల కేటాయింపులు కావాలంటే.. ఇవ్వడం లేదు..
- తెలంగాణను చంద్రబాబు ఇరకాటంలోకి నెట్టారు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana CM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. 90 టీఎంసీలు పట్టిసీమకు తీసుకెళ్లారు.. దాంట్లో మాకు 45 టీఎంసీలు రావాలని డిమాండ్ చేశారు. ఇక, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకి నీళ్ళ కేటాయింపులు కావాలి అంటే ఇవ్వడం లేదు.. ఏపీ ప్రభుత్వం అభ్యంతరం ఎందుకు చెప్తున్నారు అని ప్రశ్నించారు. మా ప్రాజెక్టులకు ఎన్ఓసీ ఇవ్వండి అన్నారు. నికర జలాల వాడుకుంటాం అంటే మీరు అభ్యంతరం చెప్తున్నారు.. వరద జలాల మీద మాత్రం మీరు మాపై కోట్లాడుతున్నారు అని పేర్కొన్నారు. చంద్రబాబు మేల్కొని.. తెలంగాణనీ ఇరకటంలోకి నెట్టిండు.. చంద్రబాబు వచ్చినా.. జగన్ వచ్చినా.. గోదావరి నీళ్లు తీసుకు పోతామన్నారు.. దీనికి కేంద్రం కూడా పరిష్కారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా సార్లు మేము కిషన్ రెడ్డినీ అడిగాం.. అధికారులను పంపి వివరాలు ఇచ్చాం.. కానీ, కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి మనుగడ తేవాలని కిషన్ రెడ్డి చూస్తున్నారు.. అంతరించిపోతున్న బీఆర్ఎస్ కి పునరుజ్జీవం పోయాలని కిషన్ రెడ్డి చూస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు.
Read Also: CM Revanth Reddy: తెలంగాణకు శాపంగా మారిన బీఆర్ఎస్ నిర్ణయాలు..
Also Read
- విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
అయితే, ప్రజలకు బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ కుట్రను చెప్పండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మన నోటి హక్కులు తాకట్టు పెట్టింది కేసీఆర్.. కేసీఆర్ ఫ్యామిలీ అంతా అబద్దాల మీద బతుకుతున్నారు.. వాళ్ళ సక్సెస్ సీక్రెట్ కూడా అబద్ధాలు చెప్పడమే అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ సచ్చిన పాము.. బీజేపీ మీద ఫోకస్ పెట్టండి.. కమలం పార్టీని, కేసీఆర్ నీ బతికించే పనిలో కిషన్ రెడ్డి ఉన్నారు.. ఆయన మాట్లాడే ప్రతి మాట.. కేటీఆర్ ఆఫీస్ నుంచి వచ్చే ప్రెస్ నోట్ అని ఆరోపించారు. మేము కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్తే.. ఎప్పుడూ మమ్మల్ని కేంద్రం దగ్గరికి తీసుకుపోలేదన్నారు. కిషన్ రెడ్డి తీరు అనుమానాలు కలిగిస్తున్నాయి.. ఇక, బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుకి శుభాకాంక్షలు.. గోదావరి నదీ జలాల సమస్యను మోడీ దృష్టికి తీసుకెళ్లండి అని సూచించారు. మీ మొదటి కార్యాచరణ ఇదే పెట్టుకోండి అన్నారు. మా అధికారులు మీకు సమాచారం ఇస్తారు.. వాళ్ళు ఇచ్చే సోషల్ మీడియా ప్రకటనలు చూసి కన్ఫ్యూజ్ అవ్వొదు.. తప్పులు చేసింది వాళ్ళే.. వాటిని కప్పి పుచ్చుకునే పనిలో ఉన్నారని తెలిపారు. కేసీఆర్ తో పంచాయతీ కంటే.. తెలంగాణ హక్కులు సాధించుకోవడం ఎలా అనేదే మా లక్ష్యమని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్లో కీలక వ్యాఖ్యలు
-
Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
-
Cockroach Janta Party: ఢిల్లీలో “కాక్రోచ్ జనతా పార్టీ” ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
-
Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!